ఆపరేషన్ సింధూర్ను పర్యవేక్షించిన.. ప్రధాని మోదీ..
- May 07, 2025
న్యూ ఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాల పై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోకి ఉగ్రరూకపై విరుచుకుపడుతోంది. పాకిస్థాన్లోని 9 ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. ఈ దాడిలో ఇప్పటివరకూ సుమారు 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ కూడా అనంతరం సరిహద్దుల వెంబడి కాల్పులకు దిగింది. అయితే భారత ఆర్మీ వారికి దీటుగా సమాధానం ఇస్తున్నారు.
పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాల పై బుధవారం వేకువజామున భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షించారు. రాత్రంతా వార్ రూమ్లో ఉండి భారత ఆర్మీకి సపోర్ట్గా ఉన్నారు. మరోవైపు ఈ దాడి వివరాలను భారత ఉన్నతాధికారులు.. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. అలాగే ఆపరేషన్ సింధూర్పై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. అదేవిధంగా భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్.. అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్ల.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







