ఆపరేషన్ సిందూర్.. అనేక విమానాశ్రయాలు మూసివేత, విమానాలు రద్దు..!!
- May 07, 2025
కువైట్: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో విమాన కార్యకలాపాలు ఇరు దేశాలు నిలిపివేశారు. దీని వలన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ధర్మశాల (DHM), లేహ్ (IXL), జమ్మూ (IXJ), శ్రీనగర్ (SXR), అమృత్సర్ (ATQ) వంటి కీలక విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలను భారత్ నిలిపివేసింది. ప్రయాణీకులు విమానయాన సంస్థలతో తమ విమానాల స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించారు.
భారత జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ నగరాలకు విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అమృత్సర్కు వెళ్లే రెండు అంతర్జాతీయ విమానాలను కూడా ఢిల్లీకి మళ్లించారు. ఎయిర్ఫీల్డ్ మూసివేయబడినందున ఈరోజు శ్రీనగర్ విమానాశ్రయం నుండి ఎటువంటి పౌర విమానాలు నడపబడవని అధికారులు తెలిపారు.
ఇటీవల ఖతార్ కూడా పాకిస్థాన్ కు తమ సర్వీసులను రద్దు చేసింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రయాణీకులు, సిబ్బంది భద్రత తమ ప్రధాన ప్రాధాన్యతగా ఉందని ఎయిర్లైన్ తెలిపింది. బాధిత ప్రయాణీకులు qatarairways.com లో రియల్-టైమ్ అప్డేట్లను తనిఖీ చేయాలని లేదా +974 4144 5555 నంబర్లో ఎయిర్లైన్ సపోర్ట్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







