ఇక పై భారత్ మరింత చేరువకానుంది
- July 13, 2015
శబ్ధవేగం కంటే మిన్నగా ప్రయాణం చేసే విమానం వచ్చేస్తోంది. గంటంటే గంటలో దుబాయ్ నుంచి భారత్కు చేర్చేస్తామని విమాన తయారీదారులు ధీమాగా చెబుతున్నారు.. ఎమిటి ఆ సంస్థ.. ? ఎప్పుడు వస్తుంది ఆ విమానం..? బోస్టన్లోని స్పైక్ ఏరోస్పేస్ కంపెనీ చెబుతోంది. ఈ దిశగా 'ఎస్-512' పేరిట ఓ సూపర్సోనిక్ (శబ్దంకన్నా వేగం) విమానాన్ని ఆ సంస్థ తయారు చేస్తోంది. గంటకు 2,200 కిలోమీటర్లవేగంతో ప్రయాణించే ఈవిమానం లండన్- న్యూయార్క్ల మధ్య 7గంటల ప్రయాణాన్ని 3 గం టలకు తగ్గించేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దుబాయ్ నుంచి కేవలం గంటలో ఇండియాలో ల్యాండయిపోతామట. దీన్ని రూపుదిద్దుతున్న ఇంజనీర్ల బృందంలో భారత సంతతి సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. దీనికి అమర్చబోయే 'డెల్టా' రెక్కలవల్ల ఇంతటి వేగం సాధ్యమని వారు వివరించారు. ఈ విమానం తయారీకి రూ.380 కోట్ల నుంచి 506 కోట్ల మధ్య ఖర్చవుతుందని సంస్థ సీఈవో విక్ కచోరియా తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







