ఇక పై భారత్ మరింత చేరువకానుంది
- July 13, 2015
శబ్ధవేగం కంటే మిన్నగా ప్రయాణం చేసే విమానం వచ్చేస్తోంది. గంటంటే గంటలో దుబాయ్ నుంచి భారత్కు చేర్చేస్తామని విమాన తయారీదారులు ధీమాగా చెబుతున్నారు.. ఎమిటి ఆ సంస్థ.. ? ఎప్పుడు వస్తుంది ఆ విమానం..? బోస్టన్లోని స్పైక్ ఏరోస్పేస్ కంపెనీ చెబుతోంది. ఈ దిశగా 'ఎస్-512' పేరిట ఓ సూపర్సోనిక్ (శబ్దంకన్నా వేగం) విమానాన్ని ఆ సంస్థ తయారు చేస్తోంది. గంటకు 2,200 కిలోమీటర్లవేగంతో ప్రయాణించే ఈవిమానం లండన్- న్యూయార్క్ల మధ్య 7గంటల ప్రయాణాన్ని 3 గం టలకు తగ్గించేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దుబాయ్ నుంచి కేవలం గంటలో ఇండియాలో ల్యాండయిపోతామట. దీన్ని రూపుదిద్దుతున్న ఇంజనీర్ల బృందంలో భారత సంతతి సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. దీనికి అమర్చబోయే 'డెల్టా' రెక్కలవల్ల ఇంతటి వేగం సాధ్యమని వారు వివరించారు. ఈ విమానం తయారీకి రూ.380 కోట్ల నుంచి 506 కోట్ల మధ్య ఖర్చవుతుందని సంస్థ సీఈవో విక్ కచోరియా తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







