బహ్రెయిన్ ఆతిధ్యరంగంలో ఈద్ బొనాంజా!

- July 13, 2015 , by Maagulf
బహ్రెయిన్ ఆతిధ్యరంగంలో ఈద్ బొనాంజా!

బహ్రెయిన్ ఆతిధ్య రంగం ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగ సందర్భంగా కళకళలాడుతోంది. పర్యాటక రంగా నిపుణులు, హోటల్ యజమానుల ప్రాధమిక అంచనాల ప్రకారం, హోటెల్ ఆక్యుపెన్సీ 90 శాతానికి పైగా పెరుగుతుందనీ, ఈద్ మొదటి మూడు రోజులలో ఆది 100 శాతం కూడా కావచ్చని కూడా భావిస్తున్నారు. మధ్య ప్రాచ్య కుటుంబాలు, ముఖ్యంగా సౌదీ వాసులు,కువైటీలు, ఎమిరేట్స్ వారు ఈ విధంగా వచ్చేవారిలో ముందంజలో ఉంటారని, షాపింగ్ మాల్స్ వద్ద, సముద్రతీర ప్రాoతాలలోని హోటళ్లు అత్యధిక అక్యుపెన్సీని కలిగియుంటాయనీ క్రోవ్న్ ప్లాజా హోటల్ డైరక్టర్ - జనరల్ ఇబ్రహీం అల్ కొహేజీ చెప్పారు. కేవలం రెస్టారెంట్లే కాక, కేఫ్ లు, ట్యాక్సీలు, గిఫ్ట్ షాపులు, ఇతర ఔట్లెట్ల కూడా లాభం పొందనున్నారని కూడా ఒక అంచనా!

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com