వైద్యుడిని మోసం చేసిన వ్యక్తికి జైలు శిక్ష.. భారీ జరిమానా..!!
- May 09, 2025
దుబాయ్: వైద్య పార్టనర్ షిప్ పేరిట అరబ్ వైద్యుడి నుండి నిధులను దుర్వినియోగం చేసినందుకు దోషిగా తేలిన 48 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి దుబాయ్ మిస్డిమీనర్స్ కోర్టు ఒక నెల జైలు శిక్ష, 600,000 దిర్హామ్ల జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత కోర్టు అతనిని బహిష్కరించాలని కూడా ఆదేశించింది. ఈ కేసు గత సంవత్సరం మే నెలలో నమోదైంది. దుబాయ్లో 600,000 దిర్హామ్ల అంచనా పెట్టుబడితో మల్టీ-స్పెషాలిటీ మెడికల్ సెంటర్ను స్థాపించడంలో భాగస్వామిగా ఉండాలనే ప్రతిపాదనతో ఆ వ్యక్తి ప్రతిపాదన చేసి అనంతరం మోసం చేశాడు.
దుబాయ్లో జరిగిన ఒక వైద్య ప్రదర్శన కలిసాడని, ఓ వెంచర్ ప్రతిపాదన చేసి, ప్రారంభ చెల్లింపుగా Dh400,000, ఆ తర్వాత మరొక Dh200,000 అతని వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. అయితే, నిధులు అందిన తర్వాత, ప్రాజెక్ట్ అతీగతి లేదని, డబ్బు తిరిగి చెల్లించడానికి నిరాకరించాడని ఆరోపించారు. దీనితో బాధితుడు అధికారులను సంప్రదించి అధికారికంగా ఫిర్యాదును దాఖలు చేశాడు. నిందితుడు డబ్బును తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నాడని అధికారులు గుర్తించి, కోర్టుకు నివేదిక సమర్పించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







