వైద్యుడిని మోసం చేసిన వ్యక్తికి జైలు శిక్ష.. భారీ జరిమానా..!!
- May 09, 2025
దుబాయ్: వైద్య పార్టనర్ షిప్ పేరిట అరబ్ వైద్యుడి నుండి నిధులను దుర్వినియోగం చేసినందుకు దోషిగా తేలిన 48 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి దుబాయ్ మిస్డిమీనర్స్ కోర్టు ఒక నెల జైలు శిక్ష, 600,000 దిర్హామ్ల జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత కోర్టు అతనిని బహిష్కరించాలని కూడా ఆదేశించింది. ఈ కేసు గత సంవత్సరం మే నెలలో నమోదైంది. దుబాయ్లో 600,000 దిర్హామ్ల అంచనా పెట్టుబడితో మల్టీ-స్పెషాలిటీ మెడికల్ సెంటర్ను స్థాపించడంలో భాగస్వామిగా ఉండాలనే ప్రతిపాదనతో ఆ వ్యక్తి ప్రతిపాదన చేసి అనంతరం మోసం చేశాడు.
దుబాయ్లో జరిగిన ఒక వైద్య ప్రదర్శన కలిసాడని, ఓ వెంచర్ ప్రతిపాదన చేసి, ప్రారంభ చెల్లింపుగా Dh400,000, ఆ తర్వాత మరొక Dh200,000 అతని వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. అయితే, నిధులు అందిన తర్వాత, ప్రాజెక్ట్ అతీగతి లేదని, డబ్బు తిరిగి చెల్లించడానికి నిరాకరించాడని ఆరోపించారు. దీనితో బాధితుడు అధికారులను సంప్రదించి అధికారికంగా ఫిర్యాదును దాఖలు చేశాడు. నిందితుడు డబ్బును తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నాడని అధికారులు గుర్తించి, కోర్టుకు నివేదిక సమర్పించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







