వైద్యుడిని మోసం చేసిన వ్యక్తికి జైలు శిక్ష.. భారీ జరిమానా..!!
- May 09, 2025
దుబాయ్: వైద్య పార్టనర్ షిప్ పేరిట అరబ్ వైద్యుడి నుండి నిధులను దుర్వినియోగం చేసినందుకు దోషిగా తేలిన 48 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి దుబాయ్ మిస్డిమీనర్స్ కోర్టు ఒక నెల జైలు శిక్ష, 600,000 దిర్హామ్ల జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత కోర్టు అతనిని బహిష్కరించాలని కూడా ఆదేశించింది. ఈ కేసు గత సంవత్సరం మే నెలలో నమోదైంది. దుబాయ్లో 600,000 దిర్హామ్ల అంచనా పెట్టుబడితో మల్టీ-స్పెషాలిటీ మెడికల్ సెంటర్ను స్థాపించడంలో భాగస్వామిగా ఉండాలనే ప్రతిపాదనతో ఆ వ్యక్తి ప్రతిపాదన చేసి అనంతరం మోసం చేశాడు.
దుబాయ్లో జరిగిన ఒక వైద్య ప్రదర్శన కలిసాడని, ఓ వెంచర్ ప్రతిపాదన చేసి, ప్రారంభ చెల్లింపుగా Dh400,000, ఆ తర్వాత మరొక Dh200,000 అతని వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. అయితే, నిధులు అందిన తర్వాత, ప్రాజెక్ట్ అతీగతి లేదని, డబ్బు తిరిగి చెల్లించడానికి నిరాకరించాడని ఆరోపించారు. దీనితో బాధితుడు అధికారులను సంప్రదించి అధికారికంగా ఫిర్యాదును దాఖలు చేశాడు. నిందితుడు డబ్బును తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నాడని అధికారులు గుర్తించి, కోర్టుకు నివేదిక సమర్పించారు.
తాజా వార్తలు
- నిర్దిష్ట సమయాల్లోనే ప్రోటోకాల్ దర్శనం
- హైదరాబాద్కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- సినీపరిశ్రమ పై డిప్యూటీ సీఎం కౌంటర్..
- పారిస్లో ఫ్రెంచ్, సౌదీ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!
- ఒమన్లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!
- యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!