భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ.. స్వాగతించిన యూఏఈ..!!
- May 11, 2025
యూఏఈ: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటనను యూఏఈ స్వాగతించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA)లోని వ్యూహాత్మక కమ్యూనికేషన్ల డైరెక్టర్ అఫ్రా అల్ హమేలి తెలిపారు. కాల్పుల విరమణ దక్షిణాసియా అంతటా భద్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసిందని అల్ హమేలి తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగ ఇరు దేశాల నాయకత్వాన్ని ప్రశసించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన దౌత్య ప్రయత్నాలపై ప్రశంసించింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటాయని మంత్రిత్వ శాఖ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇది విస్తృత ప్రాంతీయ స్థిరత్వానికి మద్దతు ఇచ్చే దశగా అభివర్ణించింది. ఈ నిర్ణయం రెండు దేశాల ప్రజలకు దీర్ఘకాలిక స్థిరత్వం, అభివృద్ధి, శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుందని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







