భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ.. స్వాగతించిన యూఏఈ..!!
- May 11, 2025
యూఏఈ: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటనను యూఏఈ స్వాగతించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA)లోని వ్యూహాత్మక కమ్యూనికేషన్ల డైరెక్టర్ అఫ్రా అల్ హమేలి తెలిపారు. కాల్పుల విరమణ దక్షిణాసియా అంతటా భద్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసిందని అల్ హమేలి తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగ ఇరు దేశాల నాయకత్వాన్ని ప్రశసించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన దౌత్య ప్రయత్నాలపై ప్రశంసించింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటాయని మంత్రిత్వ శాఖ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇది విస్తృత ప్రాంతీయ స్థిరత్వానికి మద్దతు ఇచ్చే దశగా అభివర్ణించింది. ఈ నిర్ణయం రెండు దేశాల ప్రజలకు దీర్ఘకాలిక స్థిరత్వం, అభివృద్ధి, శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుందని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!









