మే 16 నుంచే IPL..!
- May 12, 2025
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ను సస్సెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు అని మొదటగా చెప్పినప్పటికి ఎప్పుడు మళ్లీ మ్యాచ్లు ప్రారంభం అవుతాయి అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాల్పుల విరమణకు సంబంధించిన ప్రకటన వెలువడడంతో ఈ టోర్నీని పునఃప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది. అయితే..అది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
టోర్నీ పునఃప్రారంభం, షెడ్యూల్కు సంబంధించిన విషయాలను ఆదివారం ఐపీఎల్ పాలకవర్గ సభ్యులు, బీసీసీఐ అధికారులు చర్చించారు. బీసీసీఐ ప్రస్తుతం షెడ్యూల్ను సిద్ధం చేసే పనిలో ఉందని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఇప్పటి వరకు ఐపీఎల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఐపీఎల్ ఛైర్మన్, ఫ్రాంఛైజీలతో మాట్లాడుతున్నామని చెప్పారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఐపీఎల్ మే16న లేదా 17న పునఃప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన మ్యాచ్లను మూడు లేదా నాలుగు వేదికల్లోనే బెంగళూరు, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ లలో నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన లీగ్ మ్యాచ్లను డబుల్ హెడర్ (రోజుకు రెండు మ్యాచ్లు) గా నిర్వహించనున్నారు. జూన్ 1న ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. లక్నోసూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్తో టోర్నీ పునఃప్రారంభం కానుంది.
మరోవైపు టోర్నీ పునఃప్రారంభం కానుండడంతో మంగళవారం నాటికి ఆటగాళ్లను వెనక్కి పిలవాలని ఫ్రాంఛైజీలతో బీసీసీఐ చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇక ఉద్రిక్తతల కారణంగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ను కొనసాగించడం లేదా మళ్లీ నిర్వహించడం వంటివి ఉండకపోవచ్చు. రెండు జట్లకు చెరో పాయింట్ను ఇచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







