అల్ బర్షా అగ్నిప్రమాదం.. భవనాన్ని ఖాళీ చేసిన నివాసితులు..!!
- May 14, 2025
దుబాయ్: అల్ బర్షాలోని అల్ జరూని భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పిన తర్వాత, నివాసితులను రాత్రిపూట ఖాళీ చేయించడతో, అనేకమంది తమ స్నేహితుల ఇల్లో సేదతీరారు. భవనం మొదటి అంతస్తులో నివసించే ఫిలిప్పీన్స్ ప్రవాసియైన రాబ్,, తన నివాసం నుండి కొన్ని మీటర్ల దూరంలో నివసించే తన స్నేహితుడు రాత్రి పడుకునేందుకు ఆహ్వానించారని తెలిపారు.
ప్రభావిత ప్రమాదం భవనం మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ పార్కింగ్ స్థలం నుండి కొన్ని మీటర్ల దూరంలో, గత సంవత్సరం డిసెంబర్ 30న మంటలు చెలరేగిన నివాస భవనం నుండి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉంది. "రాత్రి 8.40 గంటలకు మాకు పెద్ద పేలుడు శబ్దం వినిపించింది" అని రాబ్ చెప్పారు.
భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పెర్ల్ వ్యూ రెస్టారెంట్లో గ్యాస్ లీక్ కావడం వల్లే మంటలు విస్తరించని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. పొగలు మూడవ అంతస్తు వరకు వ్యాపించాయని చెప్పారు. “రెస్టారెంట్ సిబ్బంది , కస్టమర్ల గురించి మేము ఆందోళన చెందుతున్నాము.అది భోజన సమయం. సాధారణంగా రెస్టారెంట్ ఆ సమయంలో కస్టమర్లతో ఫుల్ గా ఉంటుంది.” అని మరొక నివాసి తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









