అల్ బర్షా అగ్నిప్రమాదం.. భవనాన్ని ఖాళీ చేసిన నివాసితులు..!!
- May 14, 2025
దుబాయ్: అల్ బర్షాలోని అల్ జరూని భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పిన తర్వాత, నివాసితులను రాత్రిపూట ఖాళీ చేయించడతో, అనేకమంది తమ స్నేహితుల ఇల్లో సేదతీరారు. భవనం మొదటి అంతస్తులో నివసించే ఫిలిప్పీన్స్ ప్రవాసియైన రాబ్,, తన నివాసం నుండి కొన్ని మీటర్ల దూరంలో నివసించే తన స్నేహితుడు రాత్రి పడుకునేందుకు ఆహ్వానించారని తెలిపారు.
ప్రభావిత ప్రమాదం భవనం మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ పార్కింగ్ స్థలం నుండి కొన్ని మీటర్ల దూరంలో, గత సంవత్సరం డిసెంబర్ 30న మంటలు చెలరేగిన నివాస భవనం నుండి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉంది. "రాత్రి 8.40 గంటలకు మాకు పెద్ద పేలుడు శబ్దం వినిపించింది" అని రాబ్ చెప్పారు.
భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పెర్ల్ వ్యూ రెస్టారెంట్లో గ్యాస్ లీక్ కావడం వల్లే మంటలు విస్తరించని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. పొగలు మూడవ అంతస్తు వరకు వ్యాపించాయని చెప్పారు. “రెస్టారెంట్ సిబ్బంది , కస్టమర్ల గురించి మేము ఆందోళన చెందుతున్నాము.అది భోజన సమయం. సాధారణంగా రెస్టారెంట్ ఆ సమయంలో కస్టమర్లతో ఫుల్ గా ఉంటుంది.” అని మరొక నివాసి తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







