అల్ బర్షా అగ్నిప్రమాదం.. భవనాన్ని ఖాళీ చేసిన నివాసితులు..!!
- May 14, 2025
దుబాయ్: అల్ బర్షాలోని అల్ జరూని భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పిన తర్వాత, నివాసితులను రాత్రిపూట ఖాళీ చేయించడతో, అనేకమంది తమ స్నేహితుల ఇల్లో సేదతీరారు. భవనం మొదటి అంతస్తులో నివసించే ఫిలిప్పీన్స్ ప్రవాసియైన రాబ్,, తన నివాసం నుండి కొన్ని మీటర్ల దూరంలో నివసించే తన స్నేహితుడు రాత్రి పడుకునేందుకు ఆహ్వానించారని తెలిపారు.
ప్రభావిత ప్రమాదం భవనం మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ పార్కింగ్ స్థలం నుండి కొన్ని మీటర్ల దూరంలో, గత సంవత్సరం డిసెంబర్ 30న మంటలు చెలరేగిన నివాస భవనం నుండి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉంది. "రాత్రి 8.40 గంటలకు మాకు పెద్ద పేలుడు శబ్దం వినిపించింది" అని రాబ్ చెప్పారు.
భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పెర్ల్ వ్యూ రెస్టారెంట్లో గ్యాస్ లీక్ కావడం వల్లే మంటలు విస్తరించని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. పొగలు మూడవ అంతస్తు వరకు వ్యాపించాయని చెప్పారు. “రెస్టారెంట్ సిబ్బంది , కస్టమర్ల గురించి మేము ఆందోళన చెందుతున్నాము.అది భోజన సమయం. సాధారణంగా రెస్టారెంట్ ఆ సమయంలో కస్టమర్లతో ఫుల్ గా ఉంటుంది.” అని మరొక నివాసి తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







