పిల్లలమర్రిని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు
- May 16, 2025
--పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు
హైదరాబాద్: 7 శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న పిల్లలమర్రిలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందడి చేశారు. హైదరాబాదులో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ బృందం శుక్రవారం పిల్లలమర్రిని సందర్శించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ కు చేరుకున్నారు. తెలంగాణ పండుగల విశిష్టత సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ నృత్యాల మధ్య సుందరీమణుల బృందానికి స్వాగతం పలికారు.
మొదట శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మ్యూజియాన్ని సందర్శించారు. కాసేపు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. గిరిజన యువతుల బంజారా నృత్యం చేయగా, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వారితో జత కలిశారు.
తర్వాత పిల్లలమర్రి మహావృక్షాన్ని వీక్షించారు. చెట్టు యొక్క చరిత్ర, మహావృక్షం పునరుజ్జీవనం గురించి అటవీ శాఖ అధికారి వారికి వివరించారు. నారాయణపేట, గద్వాల చేనేత వస్త్రాలు, హస్తకళలు, కళాకృతులు స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం మర్రి చెట్టు వద్ద గ్రూప్ ఫోటో దిగారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బండ్లకృష్ణ మోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణిక రెడ్డి, వీర్లపల్లి శంకర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు