ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ప్రాపర్టీ వివాదం.. వేలం వేయాలని కోర్టు ఆదేశాలు..!!
- May 17, 2025
మనామా: ముగ్గురు స్నేహితుల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న జాయింట్ వెంచర్ వివాదం ఎట్టకేలకు ముగింపుకొచ్చింది. ప్రాపర్టీ షేర్ హోల్డర్ల వాటా మొత్తాలను చెల్లించని కారణంగా BD280,000 విలువైన ఆస్తిని వేలంలో విక్రయించనున్నారు. మూడవ పార్టనర్ తమ వాటాలను చెల్లించడానికి నిరాకరించడంతో ఇద్దరు భాగస్వాములు కోర్టును ఆశ్రయించారు. ముగ్గురూ తమ పొదుపు మొత్తాన్ని ఇంటి నిర్మాణం కోసం కేటాయించినట్లు, తరువాత దానిని విక్రయించి డబ్బును పంచుకోవాలని ఆశించినట్లు కోర్టుకు తెలిపారు. వారిలో ఒకరు చివరిలో అడ్డం తిరగడంతో ఏడు సంవత్సరాలుగా వివాదం నడుస్తుందని, తమ ప్రయత్నాలు ఫలించలేదని, ఆస్తి ముగ్గురి పేర్లలోనూ నమోదు అయి ఉందని దానిని వేలం వేసి సొమ్మను తిరిగి ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. వారి వాదనలు విన్న కోర్టు ప్రాపర్టీని వేలం వేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..