ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ప్రాపర్టీ వివాదం.. వేలం వేయాలని కోర్టు ఆదేశాలు..!!
- May 17, 2025
మనామా: ముగ్గురు స్నేహితుల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న జాయింట్ వెంచర్ వివాదం ఎట్టకేలకు ముగింపుకొచ్చింది. ప్రాపర్టీ షేర్ హోల్డర్ల వాటా మొత్తాలను చెల్లించని కారణంగా BD280,000 విలువైన ఆస్తిని వేలంలో విక్రయించనున్నారు. మూడవ పార్టనర్ తమ వాటాలను చెల్లించడానికి నిరాకరించడంతో ఇద్దరు భాగస్వాములు కోర్టును ఆశ్రయించారు. ముగ్గురూ తమ పొదుపు మొత్తాన్ని ఇంటి నిర్మాణం కోసం కేటాయించినట్లు, తరువాత దానిని విక్రయించి డబ్బును పంచుకోవాలని ఆశించినట్లు కోర్టుకు తెలిపారు. వారిలో ఒకరు చివరిలో అడ్డం తిరగడంతో ఏడు సంవత్సరాలుగా వివాదం నడుస్తుందని, తమ ప్రయత్నాలు ఫలించలేదని, ఆస్తి ముగ్గురి పేర్లలోనూ నమోదు అయి ఉందని దానిని వేలం వేసి సొమ్మను తిరిగి ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. వారి వాదనలు విన్న కోర్టు ప్రాపర్టీని వేలం వేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









