ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ప్రాపర్టీ వివాదం.. వేలం వేయాలని కోర్టు ఆదేశాలు..!!
- May 17, 2025
మనామా: ముగ్గురు స్నేహితుల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న జాయింట్ వెంచర్ వివాదం ఎట్టకేలకు ముగింపుకొచ్చింది. ప్రాపర్టీ షేర్ హోల్డర్ల వాటా మొత్తాలను చెల్లించని కారణంగా BD280,000 విలువైన ఆస్తిని వేలంలో విక్రయించనున్నారు. మూడవ పార్టనర్ తమ వాటాలను చెల్లించడానికి నిరాకరించడంతో ఇద్దరు భాగస్వాములు కోర్టును ఆశ్రయించారు. ముగ్గురూ తమ పొదుపు మొత్తాన్ని ఇంటి నిర్మాణం కోసం కేటాయించినట్లు, తరువాత దానిని విక్రయించి డబ్బును పంచుకోవాలని ఆశించినట్లు కోర్టుకు తెలిపారు. వారిలో ఒకరు చివరిలో అడ్డం తిరగడంతో ఏడు సంవత్సరాలుగా వివాదం నడుస్తుందని, తమ ప్రయత్నాలు ఫలించలేదని, ఆస్తి ముగ్గురి పేర్లలోనూ నమోదు అయి ఉందని దానిని వేలం వేసి సొమ్మను తిరిగి ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. వారి వాదనలు విన్న కోర్టు ప్రాపర్టీని వేలం వేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









