యూఏఈలో డ్రోన్ల కోసం.. తొలిసారి జాతీయ సైబర్ భద్రతా గైడ్ లైన్స్..!!
- May 18, 2025
యూఏఈ: డ్రోన్ల కోసం యూఏఈ సైబర్ భద్రతా మండలి శనివారం తొలి జాతీయ మార్గదర్శకాలను ప్రకటించింది. వ్యవసాయం, పర్యావరణ పర్యవేక్ష, లాజిస్టిక్స్ వంటి వివిధ రంగాలలో డ్రోన్ల వినియోగం పెరుగుతున్నందునా.. గగనతలం, మౌలిక సదుపాయాలు, సైబర్ ముప్పుల నేపథ్యంలో అవసరమైన కార్యాచరణ అత్యవసరంగా మారిందని అధికారులు తెలిపారు.
యూఏఈ ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మొహమ్మద్ అల్ కువైట్ మాట్లాడుతూ.. ఈ ముఖ్యమైన జాతీయ మార్గదర్శకాలు డిజిటల్ పరంగా మెరుగైన విధానాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. రీచ్ గ్రూప్ సీఈఓ మాలెక్ మెల్హెమ్ మాట్లాడుతూ.. యూఏఈ డిజిటల్, సైబర్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గ్రూప్ కట్టుబడి ఉందని అన్నారు.
ఈ చొరవ డ్రోన్ల వినియోగంలో సురక్షితమైన ఆవిష్కరణలకు మద్దతు ఇస్తుందని తెలిపారు. అదే సమయంలో జాతీయ వైమానిక మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న సైబర్ ప్రమాదాలను పరిష్కరిస్తుందని రీచ్ గ్రూప్లో గ్రోత్ అండ్ కార్పొరేట్ ట్రాన్స్ఫర్మేషన్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఖలీద్ అన్నారు.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..







