ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- January 12, 2026
ఖసాబ్: ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రిని ఒమన్ సుల్తాన్ సతీమణి, హానరబుల్ లేడీ సయ్యిదా అహ్ద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించారు. ఆధునాతన వైద్య పరికరాలను పరిశీలించారు. ముసందమ్ గవర్నరేట్లోని పౌరులు మరియు నివాసితులకు అధునాతన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా ముసందమ్ గవర్నరేట్కు చెందిన జానపద కళా బృందాలు వివిధ సాంప్రదాయ ఒమానీ వారసత్వ కళలను ప్రదర్శించారు. స్వాగత కార్యక్రమంలో స్థానిక పాఠశాలల విద్యార్థులు తమ ఆట పాటలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హిలాల్ అలీ అల్ సబ్తి, ముసందమ్ గవర్నర్ సయ్యిద్ ఇబ్రహీం సయీద్ అల్ బుసైది, విద్యాశాఖ మంత్రి డాక్టర్ మదిహా అహ్మద్ అల్ షైబానీ, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ లైలా అహ్మద్ అల్ నజ్జార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం
- 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై బ్రిటన్ నిషేధం
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం









