ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- January 12, 2026
ఖసాబ్: ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రిని ఒమన్ సుల్తాన్ సతీమణి, హానరబుల్ లేడీ సయ్యిదా అహ్ద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించారు. ఆధునాతన వైద్య పరికరాలను పరిశీలించారు. ముసందమ్ గవర్నరేట్లోని పౌరులు మరియు నివాసితులకు అధునాతన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా ముసందమ్ గవర్నరేట్కు చెందిన జానపద కళా బృందాలు వివిధ సాంప్రదాయ ఒమానీ వారసత్వ కళలను ప్రదర్శించారు. స్వాగత కార్యక్రమంలో స్థానిక పాఠశాలల విద్యార్థులు తమ ఆట పాటలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హిలాల్ అలీ అల్ సబ్తి, ముసందమ్ గవర్నర్ సయ్యిద్ ఇబ్రహీం సయీద్ అల్ బుసైది, విద్యాశాఖ మంత్రి డాక్టర్ మదిహా అహ్మద్ అల్ షైబానీ, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ లైలా అహ్మద్ అల్ నజ్జార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్లో మెరైన్ వార్నింగ్ జారీ..!!









