MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- January 12, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వ్యాపారులకు మద్దతు ఇవ్వడానికి మరియు దేశీయ, విదేశీ పెట్టుబడును ఆకర్షించడానికి ఎలక్ట్రానిక్ సేవలను విస్తరించింది. MoCI యొక్క సింగిల్ విండో ప్లాట్ఫారమ్ లో వ్యాపార అనుమతి ప్రక్రియలను సులభతరం చేయడం, వినియోగదారులకు సేవలను మరింత చేరువ చేయడానికి కొత్తగా 13 ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించారు.
అధికారిక గణంకాల ప్రకారం.. గత సంవత్సరం మూడవ త్రైమాసికం వరకు ప్రాసెస్ చేయబడిన మొత్తం లావాదేవీల సంఖ్య 72,500కి చేరుకున్నాయి. వాటిలో 89 శాతం సింగిల్ విండో ప్లాట్ఫారమ్ ద్వారా ఎలక్ట్రానిక్గా పూర్తి చేశారు. ఈ సేవలపై కస్టమర్ సంతృప్తి రేటు 94 శాతంగా ఉంది.
2026లో మేధో సంపత్తి హక్కుల రక్షణను బలోపేతం చేయడం ద్వారా పోటీతత్వాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









