MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- January 12, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వ్యాపారులకు మద్దతు ఇవ్వడానికి మరియు దేశీయ, విదేశీ పెట్టుబడును ఆకర్షించడానికి ఎలక్ట్రానిక్ సేవలను విస్తరించింది. MoCI యొక్క సింగిల్ విండో ప్లాట్ఫారమ్ లో వ్యాపార అనుమతి ప్రక్రియలను సులభతరం చేయడం, వినియోగదారులకు సేవలను మరింత చేరువ చేయడానికి కొత్తగా 13 ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించారు.
అధికారిక గణంకాల ప్రకారం.. గత సంవత్సరం మూడవ త్రైమాసికం వరకు ప్రాసెస్ చేయబడిన మొత్తం లావాదేవీల సంఖ్య 72,500కి చేరుకున్నాయి. వాటిలో 89 శాతం సింగిల్ విండో ప్లాట్ఫారమ్ ద్వారా ఎలక్ట్రానిక్గా పూర్తి చేశారు. ఈ సేవలపై కస్టమర్ సంతృప్తి రేటు 94 శాతంగా ఉంది.
2026లో మేధో సంపత్తి హక్కుల రక్షణను బలోపేతం చేయడం ద్వారా పోటీతత్వాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









