తన ఆత్మకథ పుస్తకావిష్కరణకు రావలసిందిగా రేవంత్,చంద్రబాబు కు బండారు దత్తాత్రేయ ఆహ్వానం
- May 18, 2025
హైదరాబాద్: హార్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబు లను విడి విడిగా కలిశారు.ముందుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా త్వరలో హైదరాబాద్లో నిర్వహించనున్న తన ఆత్మకథ తెలుగు అనువాదం ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని దత్తాత్రేయ సీఎం రేవంత్ను ఆహ్వానించారు.
అనంతరం వెలగపూడి వెళ్లిన దత్తాత్రేయ అక్కడ సీఎం నివాసంలో చంద్రబాబు ను కలిశారు. జూన్ 8న హైదరాబాద్ లో జరిగే పుస్తకావిష్కరణకు రావలసింది గా కోరారు.
సీనియర్ రాజకీయ నాయకుడైన బండారు దత్తాత్రేయ తన రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఈ ఆత్మకథను రచించారు.ఈ పుస్తకం ఇప్పటికే హిందీలో ‘జనతా కీ కహానీ, మేరీ ఆత్మకథా’ పేరుతో విడుదలైంది.ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఈ హిందీ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు తెలుగు పాఠకుల కోసం ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పేరుతో దీనిని తీసుకువస్తున్నారు.

తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









