తన ఆత్మకథ పుస్తకావిష్కరణకు రావలసిందిగా రేవంత్,చంద్రబాబు కు బండారు దత్తాత్రేయ ఆహ్వానం
- May 18, 2025
హైదరాబాద్: హార్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబు లను విడి విడిగా కలిశారు.ముందుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా త్వరలో హైదరాబాద్లో నిర్వహించనున్న తన ఆత్మకథ తెలుగు అనువాదం ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని దత్తాత్రేయ సీఎం రేవంత్ను ఆహ్వానించారు.
అనంతరం వెలగపూడి వెళ్లిన దత్తాత్రేయ అక్కడ సీఎం నివాసంలో చంద్రబాబు ను కలిశారు. జూన్ 8న హైదరాబాద్ లో జరిగే పుస్తకావిష్కరణకు రావలసింది గా కోరారు.
సీనియర్ రాజకీయ నాయకుడైన బండారు దత్తాత్రేయ తన రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఈ ఆత్మకథను రచించారు.ఈ పుస్తకం ఇప్పటికే హిందీలో ‘జనతా కీ కహానీ, మేరీ ఆత్మకథా’ పేరుతో విడుదలైంది.ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఈ హిందీ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు తెలుగు పాఠకుల కోసం ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పేరుతో దీనిని తీసుకువస్తున్నారు.

తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







