భారత్లో మళ్లీ కరోనా కలకలం..
- May 19, 2025
న్యూ ఢిల్లీ: తాజాగా భారత్ లోనూ మళ్లీ కోవిడ్ మొదలైంది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.
అయితే పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఉన్న కేసులన్నీ స్వల్ప తీవ్రతతోనే ఉన్నాయని వెల్లడించింది. కాగా, గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తాము అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్రం చెప్పింది.
కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం మే 12 నుంచి వారం రోజుల్లో 164 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూశాయి. గత వారం కేరళలో 69 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం 56 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR) విభాగం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం, కేసులు చాలావరకు తేలికపాటివి, అసాధారణ తీవ్రత లేదా మరణాలతో సంబంధం కలిగి లేవని ఓ అధికారి తెలిపారు. దేశంలోని జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. ఈ కేసులన్నీ దాదాపు తేలికపాటివి అని, బాధితులెరూ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని వివరించారు.
ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), ICMR ద్వారా COVID-19 తో సహా శ్వాసకోశ వైరల్ వ్యాధుల నిఘా కోసం బలమైన వ్యవస్థ ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ”కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటోంది. అప్రమత్తంగా, చురుగ్గా వ్యవహరిస్తోంది” అని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







