అల్ దహిరాలో నేషనల్ సర్వే జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్..!!
- May 21, 2025
ఇబ్రి: అల్ దహిరా గవర్నరేట్లో రక్షణ మంత్రిత్వ శాఖలోని నేషనల్ సర్వే, జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం అల్ దహిరా గవర్నర్ షేక్ నజీబ్ అలీ అల్ రోవాస్ ఆధ్వర్యంలో జరిగింది.
ఇబ్రిలోని అల్ దహిరా గవర్నర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేషనల్ సర్వే అండ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ రోల్స్, బాధ్యతలతో పాటు వివిధ సంస్థలకు అందించే సేవలపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక చర్చా సెషన్లను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ సర్వే, జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ అధిపతి బ్రిగేడియర్ నాసర్ అలీ అల్ హార్తీ, అల్ దహిరా గవర్నరేట్కు చెందిన వాలిస్, ప్రభుత్వ విభాగాల డైరెక్టర్ జనరల్లు, ప్రైవేట్ రంగం, గవర్నరేట్ మునిసిపల్ కౌన్సిల్ ప్రతినిధులు, జియోస్పేషియల్ డేటా నిపుణులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









