రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళుర్పించిన సీఎం రేవంత్
- May 21, 2025
హైదరాబాద్: భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సెక్రటేరియట్ ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. దేశ అభివృద్ధికి తమ ప్రాణాలను అర్పించిన మహానాయకుడికి నివాళులర్పిస్తూ సీఎం భావోద్వేగం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్ సహా పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీ సేవలు–దేశానికి దిక్సూచి
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశానికి వన్నెతెచ్చిన మహా నాయకుడు. ఆయన ఆర్ధిక సరళీకరణ విధానాలు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చాయి” అని అన్నారు.
“18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్యంలో వారి పాత్రను సుస్థిరం చేసిన నాయకుడు రాజీవ్ గాంధీ,” అని సీఎం కొనియాడారు.
దేశ భద్రతపై కేంద్ర వైఫల్యం–సీఎం విమర్శలు
పహల్గామ్ ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “ఒకప్పుడు ఇందిరా గాంధీ దేశ శత్రువులకు గట్టి బుద్ధి చెప్పింది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైనప్పుడు ప్రధాని వెనకడుగు వేస్తున్నారు,” అని వ్యాఖ్యానించారు.
“ట్రంప్ చెప్పాడని కాల్పులు ఆపిన కేంద్రం, ఇప్పుడు జవాన్ల మరణాలపై మౌనం పాటిస్తోంది. ఇది బీజేపీ చేతగానితనానికి నిదర్శనం,” అని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలపై విమర్శల పట్ల కౌంటర్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై చేసే విమర్శలపై స్పందించిన సీఎం, “రాహుల్ గాంధీపై విమర్శల వెనుక ఉన్నది తమ వైఫల్యాలను దాచే ప్రయత్నమే. నిజానికి దేశ భద్రత కోసం మేము బయటకు వచ్చి కేంద్రానికి మద్దతు తెలిపాం. అప్పుడు అభినందించని వారు, ఇప్పుడు విమర్శలు చేస్తారు,” అన్నారు.
విగ్రహ ఏర్పాటుపై విమర్శల పై స్పందన
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేయడంపై వచ్చిన విమర్శలను ఖండించిన సీఎం, “దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నాయకుడిని గుర్తించకపోవడం సంకుచిత మనస్తత్వం. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన త్యాగాలను చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు,” అన్నారు.
జవాన్లకు అండగా కాంగ్రెస్
“దేశ భద్రత, సమగ్రత కోసం మేము ఎప్పుడూ అండగా ఉంటాం. ఆ విషయంలో మేము రాజకీయాలు చేయం. అది మాకు బాధ్యత, బాధ్యతగా తీసుకుంటాం,” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ జ్ఞాపకాలను స్మరించుకుంటూ, ఆయన సేవలను ప్రజలకు గుర్తు చేస్తూ కాంగ్రెస్ నేతలు స్ఫూర్తిదాయకమైన మాటలు పలికారు.
తాజా వార్తలు
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!
- సౌదీ అరేబియాలో ప్రిన్స్ విలియం..చారిత్రక ప్రదేశాల విజిట్..!!
- అరేబియా, ఒమన్ సముద్రంలో ఫిషరీస్ సర్వే..!!
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..









