టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు
- May 21, 2025
తిరుపతి: టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మే 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 160 దేవాలయాల్లో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఏపీలోని 79, తెలంగాణలోని 81 దేవాలయాలలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా స్వామి వారికి అభిషేకము, ఆకుపూజ , భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగనున్నాయి. సదరు ఆలయాలలో " మనగుడి" కార్యక్రమంలో భాగంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు.
"మన గుడి" కార్యక్రమంలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశేష పర్వ రోజులలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమి పండుగ సందర్భంగా దళిత, గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో నిర్మించిన 315 భజన మందిరాలలో మన గుడి కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







