టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు
- May 21, 2025
తిరుపతి: టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మే 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 160 దేవాలయాల్లో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఏపీలోని 79, తెలంగాణలోని 81 దేవాలయాలలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా స్వామి వారికి అభిషేకము, ఆకుపూజ , భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగనున్నాయి. సదరు ఆలయాలలో " మనగుడి" కార్యక్రమంలో భాగంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు.
"మన గుడి" కార్యక్రమంలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశేష పర్వ రోజులలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమి పండుగ సందర్భంగా దళిత, గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో నిర్మించిన 315 భజన మందిరాలలో మన గుడి కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







