బంగ్లాదేశ్పై టి20 సిరీస్ను గెలుచుకున్న యూఏఈ
- May 22, 2025
షార్జా: యూఏఈ టీమ్ చరిత్ర సృష్టించింది.బంగ్లాదేశ్ పై తొలిసారి టీ20 సిరీస్ను గెలిచింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ను 2-1 తేడాతో మట్టికరిపించింది.బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో బంగ్లాపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో తంజిద్ హసన్ (18 బంతుల్లో 40 పరుగులు), జాకర్ అలీ (34 బంతుల్లో 41 పరుగులు) లు రాణించారు.కెప్టెన్ లిటన్ దాస్ (14),తౌహీద్ హృదోయ్(0), మెహదీ హసన్ మిరాజ్ (2) లు విఫలం అయ్యారు.
యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ మూడు వికెట్లు తీశాడు.సఘీర్ ఖాన్, మతియుల్లా ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆకిఫ్ రాజా, ధ్రువ్ పరాషర్ తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం లక్ష్యాన్ని యూఏఈ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. యూఏఈ బ్యాటర్లలో అలిషాన్ షరాఫూ (68 నాటౌట్; 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు.అతడితో పాటు ఆసిఫ్ ఖాన్ (41నాటౌట్; 26 బంతుల్లో 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, తంజిమ్ హసన్ సకీబ్, రిషద్ హొస్సేన్ తలా ఓ వికెట్ తీశారు.
దీంతో టీ20 సిరీస్ను యూఏఈ 2-1తో కైవసం చేసుకుంది.టెస్టు హోదా కలిగిన జట్టు ద్వైపాక్షిక సిరీస్ గెలడం యూఏఈకి ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







