పుష్కరాల్లో తొక్కిసలాట, 11మంది మృతి
- July 13, 2015
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలు తీవ్ర విషాదాన్ని రగిలించాయి. రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 11మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే. ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్రగాయాల పాలైనట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. మృతులు విశాఖ, శ్రీకాకుళం, పశ్చిమగోదావరికి చెందినవారి తెలుస్తోంది. గాయపడిన వారిని రాజమండ్రికి ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. కాగా భక్తులను అదుపు చేయటంలో పోలీసులు విఫలమయ్యారు. కాగా, పుష్కర ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని భక్తులు చెబుతున్నారు. మరోవైపు పుష్కర ఏర్పాట్లపై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. భక్తులను తరలించేందుకు ఏర్పాటు చేసామన్న ఫ్రీ బస్సుల జాడ లేదని విమర్శించారు. క్యూ లైన్ల వ్యవస్థ సరిగా లేదని తెలిపారు. కనీసం తాగడానికి మంచినీటి సదుపాయం కల్పించలేదని మండిపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







