పుష్కరాల్లో తొక్కిసలాట, 11మంది మృతి

- July 13, 2015 , by Maagulf
పుష్కరాల్లో తొక్కిసలాట, 11మంది మృతి

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలు తీవ్ర విషాదాన్ని రగిలించాయి. రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 11మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే. ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్రగాయాల పాలైనట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. మృతులు విశాఖ, శ్రీకాకుళం, పశ్చిమగోదావరికి చెందినవారి తెలుస్తోంది. గాయపడిన వారిని రాజమండ్రికి ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. కాగా భక్తులను అదుపు చేయటంలో పోలీసులు విఫలమయ్యారు. కాగా, పుష్కర ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని భక్తులు చెబుతున్నారు. మరోవైపు పుష్కర ఏర్పాట్లపై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. భక్తులను తరలించేందుకు ఏర్పాటు చేసామన్న ఫ్రీ బస్సుల జాడ లేదని విమర్శించారు. క్యూ లైన్ల వ్యవస్థ సరిగా లేదని తెలిపారు. కనీసం తాగడానికి మంచినీటి సదుపాయం కల్పించలేదని మండిపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com