గంటగంటకూ పెరుగుతున్న మృతులు...
- July 13, 2015
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘట్ వద్ద మృతుల సంఖ్య గంటగంటకూ పెరిగిపోతోంది. తొలుత ఒక్కరు, ఆపై ముగ్గురు.. ఆరుగురు.. అంటూ ఇలా మృతుల సంఖ్య ఏకంగా 24కు చేరుకుంది. అనధికారికంగా ఈ సంఖ్య 30కు చేరిందని సమాచారం. భారీగా భక్తులు తరలిరావడం, వారు తొందరపడి గోడదూకడాలు వంటి పనులు చేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాటు మొదలైంది. దీంతో భక్తుల మరణాలు గంటగంటకూ పెరిగిపోతున్నాయి. ఇదిలాఉండగా ఏపీ ప్రభుత్వం పటిష్ట భద్రత చర్యలు చేపట్టలేదంటూ యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నప్పటికీ, మరోవైపు వీఐపీలకు సాఫీగా పుష్కర స్నానం, పూజా కార్యక్రమాలు నిర్వహణ చేస్తుండటం గమనార్హం. టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేయడం లేదని అంబులెన్స్ లు అందుబాటులో లేవని అరకొర ఏర్పాట్లపై భక్తులు మండిపడుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిచడంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







