హెడ్ టు హెడ్ చాలెంజ్లో 20 మంది కంటెస్టెంట్స్
- May 23, 2025
హైదరాబాద్:72వ మిస్ వరల్డ్ పోటీల్లో తాజాగా మరో కీలక దశను చేరుకుంది. నిన్న తొలిరౌండ్ విజయవంతమైంది. తర్వాత, హెట్టుహెడ్ చాలెంజ్కు ఎంపికైన టాప్ 20 ఫైనలిస్టుల జాబితాను తాజాగా ప్రకటించారు. 107 మంది పోటీ దారులు ఈ పోటీలో పాల్గొన్నారు. వారు తమ వ్యక్తిత్వాన్ని, సామాజిక స్పృహను ప్రదర్శిస్తూ, మానసిక ఆరోగ్యం, మహిళల సాధికారత, విద్య, పర్యావరణ సంరక్షణ, సాంస్కృతిక పరిరక్షణ వంటి కీలక విషయాలపై ఆత్మవిశ్వాసంగా ప్రసంగించారు. ఈ మాటల పోరులో ప్రతిభ, ఆలోచనల స్పష్టత, సమాజం పట్ల ఉన్న బాధ్యతను దృష్టిలో పెట్టుకుని బెస్ట్ 20 మంది ఎంపికయ్యారు. ఇందులో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాకు అవకాశం దక్కలేదు. ఇవాళ జరిగే తుది రౌండ్ , ఎంపికైన 20 మంది ఫైనలిస్టులకు మరోసారి తమ సామాజిక దృక్పథాన్ని ప్రదర్శించే అవకాశం లభించనుంది. విజేతను ఎంపిక చేయడంలో అభిప్రాయాలు స్పష్టత, సామాజిక బాధ్యతపై ఉన్న నిబద్ధత, వ్యక్తిగత అంకితభావం కీలక ప్రమాణాలుగా ఉపయోగించనున్నారు.
తాజా వార్తలు
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!







