భారత్లో 20 లక్షల మందికి వెబ్ డెవలపర్లగా శిక్షణ ఇవ్వనున్న గూగుల్
- July 11, 2016
ప్రముఖ సెర్చింజిన్ దిగ్గజ కంపెనీ గూగుల్ భారత్లో 20 లక్షల మందికి వెబ్ డెవలపర్లగా శిక్షణనివ్వనున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్ నైపుణ్యత, ధ్రువీకరణ ప్రోగ్రామ్ను సోమవారం ఆవిష్కరించిన సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. దేశంలోని అన్ని వర్సిటీల్లో ఈ ప్రోగ్రామ్పై సిలబస్ను రూపొందించి శిక్షణను అందుబాటులో వుంచనున్నట్లు ప్రొడెక్ట్ వైస్ప్రెసిడెంట్ కాసెర్ సేన్గుప్తా వెల్లడించారు.
స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉచితంగా లక్షలాది మంది యువతకు చేరువచేయనున్నట్లు తెలిపారు. తద్వారా మొబైల్ యాప్ అభివృద్ధిలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఈ కోర్సును జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రైవేటు, ప్రభుత్వ వర్సిటీలన్నింటిలోనూ అందుబాటులో వుంచనున్నట్లు వివరించారు. ఈ నెల 18 నుంచి ఆండ్రాయిడ్ ప్రాథమికాంశాలకు సంబంధించిన కోర్సులను అందుబాటులో తీసుకురానున్నట్టు తెలిపారు.
గూగుల్ ఈ కోర్సును ఉడాసిటీ, ఎడ్యురేఖ, మణిపాల్ గ్లోబల్, సింప్లీలెర్న్, అప్గ్రేడ్ సంస్థల భాగస్వామ్యంతో భారత్లోని అన్ని వర్సిటీల్లో అందించేందుకు ముందుకొచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు







