వైజాగ్ లో 'యాంటీ డ్రగ్ పార్క్'
- June 02, 2025
విశాఖపట్నం: విశాఖపట్నంలో సరికొత్త ఆవిష్కరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో “యాంటి డ్రగ్ పార్క్” ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు.సెంట్రల్ పార్క్లోని రెండు ఎకరాల భూమిలో మూడు కోట్ల పైచిలుకు వ్యయంతో ఈ పార్క్ నిర్మాణం జరగనుంది.డ్రగ్స్ దుర్వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల్లో, ముఖ్యంగా యువతలో, అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ పార్క్ ప్రణాళిక రూపొందించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా పార్క్ను ఏర్పాటు చేయడం విశేషం.
డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను యువతకు తెలియజేసి కౌన్సిలింగ్ కేంద్రాలు
ఈ పార్క్లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను యువతకు స్పష్టంగా తెలియజేసేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మాదక ద్రవ్యాలకు బానిసలైనవారికి పునరావాస సదుపాయాలుగా కూడా ఈ పార్క్ పనిచేయనుంది. “పార్క్ ఆఫ్ లైఫ్” కాన్సెప్ట్తో డ్రగ్లేని జీవితం ఎంత అందంగా, శాంతంగా ఉంటుందో అనుభవపూర్వకంగా చూపించబోతున్నారు. పచ్చదనం, విద్యుత్ కాంతుల మొక్కలు, రంగురంగుల చెట్లు, సీతాకోకచిలుకల మోడల్స్, వాటర్ ఫౌంటెన్స్ వంటి అంశాలు ఈ పార్క్ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.
సిటీ సెంట్రల్ పార్క్కు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ పార్క్ను సందర్శించేలా మోటివేషన్
ఈ యాంటి డ్రగ్ పార్క్ యువతకు ఒక బలమైన సందేశాన్ని అందించడమే కాకుండా, విశాఖపట్నం నగరానికి మరో కొత్త ఆకర్షణగా మారనుంది.సిటీ సెంట్రల్ పార్క్కు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ పార్క్ను సందర్శించేలా మోటివేషన్ కార్యక్రమాలు చేపడతామని విఎంఆర్డిఏ తెలిపింది.యువగళం పాదయాత్రలో ఈ ఆలోచనకు బీజం పడగా, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకుంటున్నామని ప్రణవ్ గోపాల్ అన్నారు. వియత్నామ్ వంటి దేశాలలో మాదక ద్రవ్యాలపై ప్రజల చైతన్యానికి ఇటువంటి ప్రయత్నాలు ఎంతో ఫలప్రదంగా మారిన దృష్ట్యా, ఈ యాంటి డ్రగ్ పార్క్ కూడా మంచి మార్పు తీసుకురాగలదని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







