11 మంది మృతి : ఇరాక్లో ఆత్మాహుతి దాడి
- July 12, 2016
ఇరాక్లో మళ్లీ ఆత్మాహుతి దాడి జరిగింది. అల్-రషిదియా జిల్లాలో షియా ముస్లింలు అధికంగా ఉండే మార్కెట్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో బాగ్దాద్ సహా పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భద్రతాదళాలు మోహరించాయి. గత వారం బాగ్దాద్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెండు సార్లు చేసిన దాడుల్లో సుమారు 300 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం అల్-రషిదియాలోని కూరగాయలు, పండ్ల మార్కెట్లో పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కారు బాంబును ఉగ్రవాదులు పేల్చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







