11 మంది మృతి : ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి

- July 12, 2016 , by Maagulf
11 మంది మృతి  : ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి

ఇరాక్‌లో మళ్లీ ఆత్మాహుతి దాడి జరిగింది. అల్‌-రషిదియా జిల్లాలో షియా ముస్లింలు అధికంగా ఉండే మార్కెట్‌ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో బాగ్దాద్‌ సహా పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భద్రతాదళాలు మోహరించాయి. గత వారం బాగ్దాద్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు రెండు సార్లు చేసిన దాడుల్లో సుమారు 300 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం అల్‌-రషిదియాలోని కూరగాయలు, పండ్ల మార్కెట్‌లో పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కారు బాంబును ఉగ్రవాదులు పేల్చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటన చేయలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com