బంగారం ధర స్వల్పంగా పెరిగింది

- July 12, 2016 , by Maagulf
బంగారం ధర స్వల్పంగా పెరిగింది

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో వరుసగా రెండో రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. రూ. 40 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ. 30,890కు చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధరలు పెరుగుతున్నట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,356.20 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.
బంగారం దారిలోనే వెండి ధర కూడా నేడు రూ.40 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 46,770కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువవడంతో గత కొద్ది రోజులుగా వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com