ఈద్ అల్ అధా.. ఖతార్ లో హెల్త్ సెంటర్స్ పనివేళల్లో మార్పులు..!!
- June 04, 2025
దోహా, ఖతార్: ఈద్ అల్ అధా సెలవుల సందర్భంగా ప్రజారోగ్య రంగం పనివేళలను ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ప్రకటించింది. హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) ఆసుపత్రులలోని అన్ని అత్యవసర సేవలు, ఇన్పేషెంట్ విభాగాలు, పీడియాట్రిక్ ఎమర్జెన్సీ సెంటర్లు, అలాగే అంబులెన్స్ సర్వీస్ కూడా 24/7 ఆన్-కాల్ ప్రాతిపదికన పనిచేస్తాయని తెలిపింది.
ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC)తో అనుబంధంగా ఉన్న 20 ఆరోగ్య కేంద్రాలు సెలవుదినం సందర్భంగా పనిచేస్తాయని, అల్ జుమైలియా హెల్త్ సెంటర్ 24/7 ఆన్-కాల్ ప్రాతిపదికన పనిచేస్తుందని తెలిపింది. PHCC 12 ఆరోగ్య కేంద్రాలలో 24 గంటలూ అత్యవసర సంరక్షణ సేవలను అందిస్తుందని, వీటిలో అత్యవసర పిల్లల కేసులకు సంబంధించిన ఆరు కేంద్రాలు కూడా ఉన్నాయని వెల్లడించింది.
శుక్రవారాలు, శనివారాలు మినహా విదేశీ చికిత్స విభాగం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు పనిచేయనుంది. అలాగే ఉమెన్స్ వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ (WWRC)లో ఉన్న జనన నమోదు కార్యాలయం.. ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పనిచేస్తుంది. మరణ నమోదు యూనిట్ కూడా ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పనిచేస్తుందని ప్రకటించారు. ఖతార్ హెల్త్ కేర్ యూనిఫైడ్ కాంటాక్ట్ సెంటర్ 16000 నెంబర్ నిరాంతరాయంగా పనిచేస్తూనే ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









