ఈద్ అల్ అధా.. ఖతార్ లో హెల్త్ సెంటర్స్ పనివేళల్లో మార్పులు..!!
- June 04, 2025
దోహా, ఖతార్: ఈద్ అల్ అధా సెలవుల సందర్భంగా ప్రజారోగ్య రంగం పనివేళలను ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ప్రకటించింది. హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) ఆసుపత్రులలోని అన్ని అత్యవసర సేవలు, ఇన్పేషెంట్ విభాగాలు, పీడియాట్రిక్ ఎమర్జెన్సీ సెంటర్లు, అలాగే అంబులెన్స్ సర్వీస్ కూడా 24/7 ఆన్-కాల్ ప్రాతిపదికన పనిచేస్తాయని తెలిపింది.
ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC)తో అనుబంధంగా ఉన్న 20 ఆరోగ్య కేంద్రాలు సెలవుదినం సందర్భంగా పనిచేస్తాయని, అల్ జుమైలియా హెల్త్ సెంటర్ 24/7 ఆన్-కాల్ ప్రాతిపదికన పనిచేస్తుందని తెలిపింది. PHCC 12 ఆరోగ్య కేంద్రాలలో 24 గంటలూ అత్యవసర సంరక్షణ సేవలను అందిస్తుందని, వీటిలో అత్యవసర పిల్లల కేసులకు సంబంధించిన ఆరు కేంద్రాలు కూడా ఉన్నాయని వెల్లడించింది.
శుక్రవారాలు, శనివారాలు మినహా విదేశీ చికిత్స విభాగం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు పనిచేయనుంది. అలాగే ఉమెన్స్ వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ (WWRC)లో ఉన్న జనన నమోదు కార్యాలయం.. ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పనిచేస్తుంది. మరణ నమోదు యూనిట్ కూడా ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పనిచేస్తుందని ప్రకటించారు. ఖతార్ హెల్త్ కేర్ యూనిఫైడ్ కాంటాక్ట్ సెంటర్ 16000 నెంబర్ నిరాంతరాయంగా పనిచేస్తూనే ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







