40 కి.మీ. కాజ్వేపై ఫాస్ట్-ట్రాకింగ్.. చర్చించిన బహ్రెయిన్, ఖతార్..!!
- June 04, 2025
మనామా: హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఖతార్ ఎమిర్ హిస్ హైనెస్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఆదేశాలకు అనుగుణంగా కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సేవలను పెంపొందించడంపై దృష్టి సారించినట్లు రవాణా, టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా తెలిపారు. ఖతార్ రవాణా మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ థానీ ప్రతినిధి బృందంతో మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారిక సమావేశం సందర్భంగా ఈ మేరకు తెలిపారు.
ఆర్థిక, పెట్టుబడి సహకారాన్ని పెంచడంతోపాటు ఏవియేషన్ వంటి రంగాలలో సాంకేతిక నైపుణ్యాన్ని షేర్ చేసుకోవడం ఈ పర్యటన లక్ష్యమని ఖతార్ మంత్రి తెలిపింది. ఖతార్తో బహ్రెయిన్ పెరుగుతున్న భాగస్వామ్యం పట్ల డాక్టర్ అల్ ఖలీఫా సంతృప్తి వ్యక్తం చేశారు. 40 కిలోమీటర్ల బహ్రెయిన్-ఖతార్ కాజ్వే తోపాటు ప్రతిపాదిత ఉమ్మడి సముద్ర లింక్తో సహా కీలకమైన అభివృద్ధి , వ్యూహాత్మక ప్రాజెక్టులపై ఈ సందర్భంగా చర్చించారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య, పర్యాటకాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ వ్యూహాత్మక ప్రాజెక్టులు జిసిసి ఆర్థిక సమైక్యతకు గణనీయంగా దోహదపడతాయని, 2030 నాటికి పూర్తవుతుందని భావిస్తున్న జిసిసి రైల్వే ప్రాజెక్టుకు పూర్తి దోహదపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









