40 కి.మీ. కాజ్వేపై ఫాస్ట్-ట్రాకింగ్.. చర్చించిన బహ్రెయిన్, ఖతార్..!!
- June 04, 2025
మనామా: హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఖతార్ ఎమిర్ హిస్ హైనెస్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఆదేశాలకు అనుగుణంగా కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సేవలను పెంపొందించడంపై దృష్టి సారించినట్లు రవాణా, టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా తెలిపారు. ఖతార్ రవాణా మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ థానీ ప్రతినిధి బృందంతో మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారిక సమావేశం సందర్భంగా ఈ మేరకు తెలిపారు.
ఆర్థిక, పెట్టుబడి సహకారాన్ని పెంచడంతోపాటు ఏవియేషన్ వంటి రంగాలలో సాంకేతిక నైపుణ్యాన్ని షేర్ చేసుకోవడం ఈ పర్యటన లక్ష్యమని ఖతార్ మంత్రి తెలిపింది. ఖతార్తో బహ్రెయిన్ పెరుగుతున్న భాగస్వామ్యం పట్ల డాక్టర్ అల్ ఖలీఫా సంతృప్తి వ్యక్తం చేశారు. 40 కిలోమీటర్ల బహ్రెయిన్-ఖతార్ కాజ్వే తోపాటు ప్రతిపాదిత ఉమ్మడి సముద్ర లింక్తో సహా కీలకమైన అభివృద్ధి , వ్యూహాత్మక ప్రాజెక్టులపై ఈ సందర్భంగా చర్చించారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య, పర్యాటకాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ వ్యూహాత్మక ప్రాజెక్టులు జిసిసి ఆర్థిక సమైక్యతకు గణనీయంగా దోహదపడతాయని, 2030 నాటికి పూర్తవుతుందని భావిస్తున్న జిసిసి రైల్వే ప్రాజెక్టుకు పూర్తి దోహదపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!







