40 కి.మీ. కాజ్వేపై ఫాస్ట్-ట్రాకింగ్.. చర్చించిన బహ్రెయిన్, ఖతార్..!!
- June 04, 2025
మనామా: హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఖతార్ ఎమిర్ హిస్ హైనెస్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఆదేశాలకు అనుగుణంగా కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సేవలను పెంపొందించడంపై దృష్టి సారించినట్లు రవాణా, టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా తెలిపారు. ఖతార్ రవాణా మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ థానీ ప్రతినిధి బృందంతో మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారిక సమావేశం సందర్భంగా ఈ మేరకు తెలిపారు.
ఆర్థిక, పెట్టుబడి సహకారాన్ని పెంచడంతోపాటు ఏవియేషన్ వంటి రంగాలలో సాంకేతిక నైపుణ్యాన్ని షేర్ చేసుకోవడం ఈ పర్యటన లక్ష్యమని ఖతార్ మంత్రి తెలిపింది. ఖతార్తో బహ్రెయిన్ పెరుగుతున్న భాగస్వామ్యం పట్ల డాక్టర్ అల్ ఖలీఫా సంతృప్తి వ్యక్తం చేశారు. 40 కిలోమీటర్ల బహ్రెయిన్-ఖతార్ కాజ్వే తోపాటు ప్రతిపాదిత ఉమ్మడి సముద్ర లింక్తో సహా కీలకమైన అభివృద్ధి , వ్యూహాత్మక ప్రాజెక్టులపై ఈ సందర్భంగా చర్చించారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య, పర్యాటకాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ వ్యూహాత్మక ప్రాజెక్టులు జిసిసి ఆర్థిక సమైక్యతకు గణనీయంగా దోహదపడతాయని, 2030 నాటికి పూర్తవుతుందని భావిస్తున్న జిసిసి రైల్వే ప్రాజెక్టుకు పూర్తి దోహదపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









