ఇటలీలోని దక్షిణ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం
- July 12, 2016
ఇటలీలోని దక్షిణ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో 20 మంది మరణించగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. బారి నగర సమీపంలో ఒకే ట్రాక్పై రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. అత్యవసర సేవల విభాగం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. పలువురిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో కొన్ని రైళ్ల బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను సహాయక సిబ్బంది బయటకు తీసుకొస్తున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన ట్రాక్పై రోజూ 200 రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ఇతర రైళ్ల ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా అదనంగా ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఘటనపై ఇటలీ ప్రధాని మాట్టెయో రేంజి విచారం వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







