‘దోస్త్’ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి
- June 06, 2025
హైదరాబాద్: దోస్త్–2025 లో భాగంగా తెలంగాణలోని డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తవగా.. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతోంది. అర్హులైన విద్యార్థులు జూన్ 8లోపు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన అభ్యర్థులు జూన్ 9వ తేదీలోపు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.
‘దోస్త్’ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి:
ముందుగా తెలంగాణ దోస్త్ ఆఫీషియల్ వెబ్ సైట్http://https://dost.cgg.gov.in/ లోకి వెళ్లాలి.
హోంపేజీలో Candidate Pre-Registration అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
అక్కడ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
తర్వాత జనరేట్ అయిన దోస్త్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వాలి.
తరువాత ఫీజు చెల్లించాలి.
లాగిన్ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
తరువాత వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
సీట్ల కేటాయింపు:
సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు జూన్ 13న మొదలై జూన్ 18వ తేదీతో ముగుస్తుంది. విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ అలా ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ మేరకు జూన్ 13 నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయవచ్చు. జూన్ 18 లోపు రిపోర్టింగ్ చేయకపోతే సీటు క్యాన్సిల్ అవుతుంది. మూడు విడతలు ప్రక్రియ తరువాత కూడా సీట్లు ఖాళీగా ఉంటే వాటిని స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లుగా ప్రకటిస్తారు.
మూడో విడత ఎప్పుడంటే:
తెలంగాణ దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 13 నుంచి 19 వరకు కొనసాగనుంది. జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







