ఇద్దరు ఫుట్ బాల్ ప్లేయర్స్ సస్పెండ్.. Dh500,000 జరిమానా..!!

- June 09, 2025 , by Maagulf
ఇద్దరు ఫుట్ బాల్ ప్లేయర్స్ సస్పెండ్.. Dh500,000 జరిమానా..!!

యూఏఈ: యూఏఈ ఫుట్‌బాల్ అసోసియేషన్ స్థానిక పోటీలకు సంబంధించి 2 ఆటగాళ్లపై 5 మ్యాచ్‌లు ఆడకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. షార్జా క్లబ్ ఆటగాడు ఖలీద్ అల్ ధన్హాని, షబాబ్ అల్ అహ్లి క్లబ్ ఆటగాడు సుల్తాన్ అదెల్‌లను జాతీయ జట్టు నుంచి తొలగిస్తామని పేర్కొంది. వారికి ఒక్కొక్కరికి Dh500,000 జరిమానా విధించింది. జూన్ 7న ఇద్దరు ఆటగాళ్ళు జాతీయ జట్టు శిబిరంలో ఉల్లంఘనకు పాల్పడారు. ఈ నేపథ్యంలో వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.  జాతీయ జట్టు మేనేజర్ యాని అల్లాహ్ మాట్లాడుతూ.. జాతీయ జట్లకు క్రమశిక్షణ, ఆంక్షల నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com