కొత్త మీడియా చట్టం.. కంటెంట్ క్రియేటర్స్ ను ప్రభావితం చేస్తుందా?
- June 09, 2025
యూఏఈ: యూఏఈలో కొత్త మీడియా చట్టం అమలుతో కంటెంట్ క్రియేటర్స్ ఇప్పుడు మరింత నియంత్రిత పద్ధతిలో పనిచేయనున్నారు. విస్తృత నిబంధనలు వారి పనిచేసే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందా అన్న చర్చ డిజిటల్ క్రియేటర్స్ లలో జరుగుతోంది.ఈ చట్టం నైతిక కంటెంట్, బాధ్యతాయుతమైన కమ్యూనికేషన్ను ప్రోత్సహించడానికి రూపొందించబడినప్పటికీ, ఇది కొత్త లైసెన్సింగ్ అవసరాలను..అదే సమయంలో ఉల్లంఘనలకు భారీ జరిమానాలను కూడా విధించాలని నిర్దేశిస్తుంది.
"తెలియకుండానే ఏదైనా ఉల్లంఘించే భయం ఉంది" అని యూఏఈకి చెందిన కంటెంట్ సృష్టికర్త మొహమ్మద్ ముస్సాబ్ అన్నారు.అతను తరచుగా వెల్నెస్ బ్రాండ్లతో పనిచేస్తున్నాడు. "లైసెన్స్ ఉన్నప్పటికీ, ఏమి అనుమతించబడుతుందో.. ఏది ఫ్లాగ్ చేయబడుతుందో మీకు ఎల్లప్పుడూ ఖచ్చితంగా తెలియదు." అని వివరించారు.
మే 29 నుండి అమల్లోకి వచ్చిన కొత్త మీడియా చట్టం..బాధ్యతాయుతమైన కంటెంట్ను పెంపొందించడం, సామాజిక విలువలను రక్షించడం లక్ష్యంగా విస్తృత నియంత్రణ పద్ధతులను ప్రవేశపెట్టింది.ఇది యూఏఈలో వృత్తిపరంగా పనిచేస్తున్న లైసెన్స్ పొందిన మీడియా సంస్థలు,ఇన్ఫ్లుయెన్సర్లు,డిజిటల్ సృష్టికర్తలకు వర్తిస్తుంది.
చట్టాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, కొంతమంది కంటెంట్ సృష్టికర్తలు స్పష్టత కోసం నేషనల్ మీడియా కౌన్సిల్ను సంప్రదిస్తున్నారు.మీడియా ప్రొఫెషనల్ అయిన ఎమ్మా బ్రెయిన్..40 ఏళ్లు పైబడిన వారికి ఉపయోగపడే వెబ్సైట్ను ప్రారంభించాలని ప్రణాళిక వేసింది. కానీ కొత్త నిబంధనలు ఆమెకు వర్తిస్తాయో లేదో ఆమెకు ఖచ్చితంగా తెలియదు.
“నా వెబ్సైట్ పూర్తిగా బాగుందని వారు (నేషనల్ మీడియా కౌన్సిల్) వివరించారు. కానీ నేను ఉత్పత్తులను సమీక్షించాలని అనుకున్నందున, వారు దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) ద్వారా మార్కెటింగ్ మేనేజ్మెంట్ లైసెన్స్ పొందమని నాకు సలహా ఇచ్చారు.దీని ధర దాదాపు Dh1,000. నేను దానిని పొందిన తర్వాత, వారు మూడు సంవత్సరాల పాటు ఉచిత మీడియా లైసెన్స్ను కూడా ఇచ్చారు." అని ఆమె చెప్పారు.
ప్రక్రియ ఎంత త్వరగా జరిగిందో చూసి ఎమ్మా ఆశ్చర్యం వ్యక్తం చేసింది."నేను DET లైసెన్స్ను నిమిషాల్లో సంపాదించాను.మీడియా లైసెన్స్ 10-15 రోజులు పడుతుంది.కానీ నాకు అవసరమైన దాని కోసం ఇప్పటికే కవర్ అయింది.దాంతో నా మనసు తేలికైంది." వివరించారు. ఎమ్మా ఇతరులకు సందేహాలు ఉంటే నేరుగా అధికారులను సంప్రదించమని సూచించింది.అయితే, కొన్ని సందర్బాల్లో నిర్దేశిత నిబంధనలను కొన్నిసార్లు ఉల్లంఘించే అవకాశం ఉంటుందని, కంటెంట్ రూపకల్పన, ప్రచురించడంలో జాగ్రత్తగా ఉండాలని దుబాయ్కు చెందిన న్యాయ నిపుణురాలు లైలా జహీర్ సూచించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







