కాచిగూడ రైల్వే స్టేషన్లో నూతన లైటింగ్ సిస్టమ్
- June 09, 2025
హైదరాబాద్: హైదరాబాద్ నగర గుండె ప్రాంతంగా పేరుగాంచిన కాచిగూడ రైల్వే స్టేషన్కి తాజాగా కొత్త ఒరవడి వచ్చింది. వందేళ్ల చరిత్ర గల ఈ స్టేషన్ సోమవారం సాయంత్రం నూతన కాంతులతో అలరించింది.రూ.2.23 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రత్యేక లైటింగ్ ప్రాజెక్ట్ను కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు.1916లో నిజాం కాలంలో నిర్మితమైన గోతిక్ శైలికి చెందిన ఈ కట్టడం, ఇప్పుడు రాత్రివేళ మరింత విశిష్టంగా కనిపిస్తోంది.785 ప్రత్యేక లైటింగ్ ఫిక్చర్లు స్టేషన్ ముఖభాగాన్ని చక్కగా వెలిగిస్తున్నాయి. ఈ కొత్త లైటింగ్ వ్యవస్థ, వారసత్వ సౌందర్యాన్ని ప్రజలకు చూపించేలా ప్రత్యేకంగా రూపొందించారు.ఈ లైటింగ్ ప్రాజెక్టు భారత పర్యాటక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో రూపొందించబడింది. చారిత్రక గమ్యం అయిన కాచిగూడను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం. రాత్రివేళ స్టేషన్ దెబ్బకి కళల మేళవింపుగా దర్శనమిస్తోంది. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ఇది ఒక నూతన చిహ్నంగా నిలుస్తోంది.
ప్రయాణికులకు ప్రతి రోజూ మెరుగైన అనుభవం
ప్రతిరోజూ సగటున 45,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి ప్రయాణిస్తారు. మొత్తం 103 రైళ్ల రాకపోకలకు ఇది కేంద్రంగా మారింది. ప్రయాణికుల సౌకర్యాల విషయంలో కూడా కాచిగూడ స్టేషన్ ఇతర స్టేషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది.
పర్యావరణ హితంతో ముందడుగు
గ్రీన్ ఎనర్జీ వినియోగంపై కాచిగూడ స్టేషన్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దీని ఫలితంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) నుంచి ప్లాటినం రేటింగ్ లభించింది. అలాగే, ఎనర్జీ ఎఫిషియెంట్ స్టేషన్గా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. డిజిటల్ చెల్లింపులను మొదటగా ప్రవేశపెట్టిన స్టేషన్లలో ఇది ఒకటి కావడం గమనార్హం.
రూ.421 కోట్లతో మరింత అభివృద్ధి
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కాచిగూడ అభివృద్ధికి రూ.421.66 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ నిధులతో స్టేషన్లో ఆధునిక సదుపాయాలు, పునఃనిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. అయితే, ఈ అభివృద్ధిలో వారసత్వ నిర్మాణాలను చెడగొట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కాచిగూడ స్టేషన్ నూతన లైటింగ్ ప్రారంభం ఒక చారిత్రక ఘట్టంగా మారింది. ఈ ప్రకాశంలో ఈ కట్టడం పాత తరం గొప్పతనాన్ని, కొత్త తరం తేజస్సును కలిపేలా నిలుస్తోంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









