తెలంగాణ: ఆర్టీసీ ప్రయాణికులకు షాక్..
- June 10, 2025
హైదరాబాద్: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ భారీ షాక్ ఇచ్చింది.టీజీఎస్ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను 20 శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ పెంపు సాధారణ ప్రజలతో పాటు విద్యార్థులపై కూడా ప్రభావం చూపనుంది.ఈ కొత్త ఛార్జీలు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది.
- ప్రస్తుతం ఆర్డినరీ బస్ పాస్ ధర నెలకు రూ.1,150 ఉండగా, దానిని రూ.1,400కు పెంచారు.
- మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ రూ.1,300 నుంచి రూ.1,600కి పెరిగింది.
- మెట్రో డీలక్స్ పాస్ రూ.1,450 నుంచి రూ.1,800కి పెరిగింది.
- గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ బస్సుల పాస్ ధరలు కూడా పెరిగాయి.
ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్లో కూడా టికెట్ల ధరలను పెంచారు. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచడంతో నగరవాసులపై భారం పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తోంది.దీని వల్ల ఆర్టీసీకి భారీగా నష్టాలు వస్తున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.
సంస్థ జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని విమర్శలు వస్తున్నాయి. తమ జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం కార్మిక నేతలతో చర్చలు జరిపిన తర్వాత, వారు తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేశారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







