యూఏఈ నివాసితులకు అర్మేనియా బంపరాఫర్..!!
- June 12, 2025
యూఏఈ: GCC, యూరోపియన్ యూనియన్ (EU), స్కెంజెన్ ఏరియా లేదా యునైటెడ్ స్టేట్స్లోని దేశాలు జారీ చేసిన రెసిడెన్సీ పర్మిట్లను కలిగి ఉన్న ప్రయాణికులకు వీసా రహిత విధానాన్ని అర్మేనియన్ ప్రభుత్వం ప్రకటించింది. గత నెలలో జరిగిన ఆర్మేనియన్ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆర్మేనియా, GCC సభ్య దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుందని , పర్యాటకాన్ని పెంచుతుందని , వ్యాపార అవకాశాలను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. ఈ దేశం యూఏఈ నుండి కేవలం మూడు గంటల విమాన ప్రయాణంలో ఉంది. ఫ్లైదుబాయ్, ఎయిర్ అరేబియా, విజ్ ఎయిర్ వంటి విమానయాన సంస్థలు ప్రత్యక్ష విమానాలను నడుపుతున్నాయి. ఆ దేశం 2017లో యూఏఈ పౌరులకు, 2019లో ఖతార్కు, 2022లో కువైట్కు వీసా రహిత ప్రయాణాన్ని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









