రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు థ్యాంక్స్ చెప్పారు..
- July 13, 2016
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ థ్యాంక్స్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీకి ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ప్రస్తావించారు. ఉత్తరాఖండ్ సంక్షోభం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.ఈ తీర్పు తర్వాత ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో సంక్షోభం వీడి తిరిగి కాంగ్రెస్ చేతికే పాలన పగ్గాలు వచ్చాయి. ఈ తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విట్టర్ లో స్పందించారు.'ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ప్రధాని నరేంద్రమోదీకి వివరించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదములు' అని ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ తీర్పునుంచి మోదీ పాఠం నేర్చుకోవాలని హితవు పలికిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







