ఇజ్రాయెల్- ఇరాన్ వార్: సిట్యుయేషన్ రూమ్ను సందర్శించిన బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్..!!
- June 17, 2025
మనామా: బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఈరోజు ప్రధానమంత్రి కార్యాలయంలోని సిట్యుయేషన్ రూమ్ను సందర్శించారు. ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్ సన్నాహాలను హిజ్ రాయల్ హైనెస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిజ్ రాయల్ హైనెస్, హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో బహ్రెయిన్ దౌత్య మార్గాల ద్వారా సంక్షోభాలను పరిష్కరించే విధానానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తన పర్యటన సందర్భంగా సిట్యుయేషన్ రూమ్ కీలక బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ సవాళ్లను ఎదుర్కోవడంలో అసాధారణ నైపుణ్యం, అంకితభావాన్ని చూపిన సిబ్బందిని రాయల్ హైనెస్ అభినిందించారు. బహ్రెయిన్ ప్రజలు అసాధారణ పరిస్థితులను కూడా అభివృద్ధి, స్థిరమైన విజయానికి ప్రేరణగా మార్చుకుంటూనే ఉన్నారని ఆయన రాయల్ హైనెస్ ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









