ఇజ్రాయెల్- ఇరాన్ వార్: సిట్యుయేషన్ రూమ్ను సందర్శించిన బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్..!!
- June 17, 2025
మనామా: బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఈరోజు ప్రధానమంత్రి కార్యాలయంలోని సిట్యుయేషన్ రూమ్ను సందర్శించారు. ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్ సన్నాహాలను హిజ్ రాయల్ హైనెస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిజ్ రాయల్ హైనెస్, హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో బహ్రెయిన్ దౌత్య మార్గాల ద్వారా సంక్షోభాలను పరిష్కరించే విధానానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తన పర్యటన సందర్భంగా సిట్యుయేషన్ రూమ్ కీలక బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ సవాళ్లను ఎదుర్కోవడంలో అసాధారణ నైపుణ్యం, అంకితభావాన్ని చూపిన సిబ్బందిని రాయల్ హైనెస్ అభినిందించారు. బహ్రెయిన్ ప్రజలు అసాధారణ పరిస్థితులను కూడా అభివృద్ధి, స్థిరమైన విజయానికి ప్రేరణగా మార్చుకుంటూనే ఉన్నారని ఆయన రాయల్ హైనెస్ ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









