ఇజ్రాయెల్- ఇరాన్ వార్: సిట్యుయేషన్ రూమ్ను సందర్శించిన బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్..!!
- June 17, 2025
మనామా: బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఈరోజు ప్రధానమంత్రి కార్యాలయంలోని సిట్యుయేషన్ రూమ్ను సందర్శించారు. ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్ సన్నాహాలను హిజ్ రాయల్ హైనెస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిజ్ రాయల్ హైనెస్, హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో బహ్రెయిన్ దౌత్య మార్గాల ద్వారా సంక్షోభాలను పరిష్కరించే విధానానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తన పర్యటన సందర్భంగా సిట్యుయేషన్ రూమ్ కీలక బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ సవాళ్లను ఎదుర్కోవడంలో అసాధారణ నైపుణ్యం, అంకితభావాన్ని చూపిన సిబ్బందిని రాయల్ హైనెస్ అభినిందించారు. బహ్రెయిన్ ప్రజలు అసాధారణ పరిస్థితులను కూడా అభివృద్ధి, స్థిరమైన విజయానికి ప్రేరణగా మార్చుకుంటూనే ఉన్నారని ఆయన రాయల్ హైనెస్ ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







