హైదరాబాద్: టోలిచౌకిలో 28మంది అక్రమ విదేశీయుల గుర్తింపు
- June 20, 2025
హైదరాబాద్: టోలిచౌకి పారామౌంట్ కాలనీలో నేడు పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా నైజీరియన్లు సోమాలియన్లు కారణంగా పారామౌంట్ కాలనీలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఫిర్యాదులు వస్తుండడంతో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలతో దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా 300ఇండ్లను పోలీసులు తనిఖీలు చేశారు. 28 మంది విదేశీయుల వద్ద సరైన పత్రాలు లేవని,16 మంది వీసా కాలం పూర్తయినట్లు గుర్తించామని డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. పత్రాలు సరిగా లేని 25 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న కేంద్రాన్ని గుర్తించి సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అక్రమంగా ఉంటున్న విదేశీయుల కు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ అధికారులకు పంపిస్తామని, దీనికి సంబంధించి వారే నిర్ణయం తీసుకుంటారని డీసీపీ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పకడ్బందీగా పోలీసింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
కాగా, సుమారు 250 మంది పోలీసులతో పాటు డీసీపీ చంద్రమోహన్, అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధికి, ఏసీపీలు సుదర్శన్, సయ్యద్ ఫయాజ్, విజయ్ శ్రీనివాస్, మమ్మద్ మునావర్ తో పాటు 15 మంది ఇన్స్పెక్టర్లు, 22 మంది ఎస్సైలు, సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









