మిడిలీస్ట్ లో సైనిక ఉద్రిక్తతలు..ప్రజల భద్రతపై GCC ఆందోళన..!!
- June 23, 2025
కువైట్: మధ్యప్రాచ్యంలో సైనిక ఉద్రిక్తతలు కొనసాగడం ఈ ప్రాంత ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని ఐక్యరాజ్యసమితిలోని గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. సంఘర్షణ విస్తరించకుండా నిరోధించడానికి, ఆయా దేశాలు సంయమనం పాటించాలని GCC దేశాలు పిలుపునిచ్చాయని ఐక్యరాజ్యసమితిలో కువైట్ శాశ్వత ప్రతినిధి తారెక్ అల్-బనై తెలిపారు. జిసిసి తరపున ఈ ప్రాంతంలో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో అల్-బనై ప్రసంగించారు.
ఇరాన్లోని అణు స్థావరాలపై తాజా వైమానిక దాడులను GCC బృందం పర్యవేక్షిస్తుందన్నారు. అదే సమయంలో ఉద్రిక్తతలను ఆపేందుకు భద్రతా మండలి, అంతర్జాతీయ సమాజం తమ బాధ్యతను నిర్వర్తించాలని రాయబారి అల్-బనాయ్ కోరారు. ప్రస్తుత సంక్షోభాన్ని తగ్గించడానికి.. అందరి ప్రయోజనం కోసం భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఉద్దేశించిన ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలకు GCC దేశాలు గట్టిగా మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









