సౌదీలో గ్రోసరీ స్టోర్లలో టోబాకో, మీట్, ఫ్రూట్స్, వెజ్జిస్ సేల్స్ పై నిషేధం..!!
- June 24, 2025
రియాద్: గ్రోసరీ స్టోర్లలో (బకాలాస్) పొగాకు, ఖర్జూరం, మాంసం, పండ్లు, కూరగాయలను అమ్మకుండా సౌదీ అరేబియా నిషేధించింది. ఈ మేరకు మునిసిపాలిటీలు, గృహనిర్మాణ మంత్రి మజేద్ అల్-హోగైల్ కొత్త నిబంధనలను జారీ చేశారు. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందన్నారు. అయితే, ఇప్పటికే ఉన్న సంస్థలకు ఇప్పటి నుండి ఆరు నెలల కంటే ఎక్కువ వ్యవధి మంజూరు చేయబడుతుందని తెలిపారు.
కొత్త నిబంధనల ప్రకారం.. కియోస్క్లు, కిరాణా దుకాణాలు లేదా మినీ మార్కెట్లు ఇకపై ఖర్జూరం, మాంసం, పండ్లు, కూరగాయలు.. అలాగే సాధారణ, ఎలక్ట్రానిక్ సిగరెట్లు, షిషాతో సహా పొగాకు ఉత్పత్తులను విక్రయించడానికి అనుమతించరు. మాంసం అమ్మకానికి ప్రత్యేక లైసెన్స్ అవసరమనే షరతుతో ఈ ఉత్పత్తులన్నింటినీ సరఫరా దుకాణాలలో (సూపర్ మార్కెట్లు) విక్రయించడానికి అనుమతిస్తారు. సవరించిన నిబంధనలు ఈ ఉత్పత్తులన్నింటినీ హైపర్ మార్కెట్లలో విక్రయించడానికి అనుమతినిస్తున్నాయి. ఈ సవరణలు కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లలో ఛార్జర్ కేబుల్స్, ప్రీపెయిడ్ రీఛార్జ్ కార్డుల అమ్మకాన్ని కూడా అనుమతించనున్నాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









