ఖతార్ ప్రవాసీయుల కోసం ప్రత్యేక ఈద్ సంబరాలు
- July 14, 2015
ఈద్-ఉల్-ఫిత్ర్ పర్వదినం మొదటి రెండురోజుల్లో దేశంలోనన్న ప్రవాసీయులకోసం కతార్ ఆంతరంగిక శాఖ వారు ఏషియన్ టౌన్ మరియు వార్వా రియల్ ఎస్టేట్ కంపెనీ వారి సహకారంతో వివిధ సాంస్కృతిక, క్రీడా మరియు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్టు ఈశాఖ ప్రజా సంబంధాల డైరక్టర్ కల్నల్ అబ్దుల్లా ఖలీఫా అల్ ముఫ్తా చెప్పారు. అల్ ఖోర్ ఇండస్ట్రీయల్ ఏరియాలో - 4 ఫుట్బాల్ గ్రౌండ్లు, 4 క్రికెట్ గ్రౌండ్లు, 4 వాలీబాల్ గ్రౌండ్లు, 3 బ్యాస్కెట్బాల్ కోర్టులు, 4 కబాడీ మైదానాలు, రెండు ఓపెన్ ఏర్ సినేమా థియేటర్లు, ఒక మసీదు, 35 షాపులు మరియు ఒక హైపర్ మార్కెట్ గల బర్వా వర్కార్స్ రిక్రియేషన్ కాంప్లెక్స్ లో ఈ సంబరాలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా, 6 టీములతో ఏర్పాటు చేయనున్న క్రికెట్ టోర్నమెంట్ ముఖ్య ఆకర్షణ అని, ఇండియా మరియు నేపాలీస్ వారి అర్కేస్త్రా, రమదాన్ ఛాంపియన్షిప్ 2015లో భాగంగా వాలీబాల్ మరియు క్రికెట్ టోర్నమెంట్ల ఫైనల్స్ ఇంకా మరిన్ని కార్యక్రమాలతో అలరించనున్నామని ఆయన తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









