తిరుపతిలోని శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- June 29, 2025
తిరుపతి: తిరుపతి రాయల చెరువు రోడ్డులోని శ్రీ శక్తిపీఠం శ్రీ పాతాళ శ్వేత వారాహీ క్షేత్రంలో శ్రీ వారాహీ నవరాత్రులు సందర్భముగా శ్రీ శ్రీ శ్రీ అమ్మవారిని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆదివారం దర్శించుకున్నారు.
అనంతరం శ్రీ మరకత శక్తి కాళీదేవి, శ్రీ మరకత సిద్దేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ శక్తి పీఠాదేశ్వరీ మాతాజీ శ్రీ శ్రీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని మర్యాద పూర్వకంగా ఛైర్మన్ కలుసుకున్నారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ, శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించి స్వామి వారు, మాతాజీ వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ శక్తి పీఠంలో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ పీఠంలో పూజా కైంకర్యాలు, అన్నదానం చాలా బాగా చేస్తున్నారని చెప్పారు.
ఈ పీఠాన్ని సందర్శిస్తే కష్టాలు తీరుతాయనే విశ్వాసంతో భక్తులు చాలా మంది వస్తున్నారని ఛైర్మన్ చెప్పారు.
ప్రస్తుతం టిటిడి చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీ శక్తి పీఠం నిర్వాహకులు అభినందించారని తెలిపారు.
ముందుగా టిటిడి ఛైర్మన్ శ్రీ శక్తి పీఠం చేరుకోగానే నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం టిటిడి ఛైర్మన్ ను సత్కరించి వైదేహి మాలను సమర్పించారు.శ్రీ శక్తి పీఠం తరుపున పుస్తక ప్రసాదాన్ని ఛైర్మన్ కు అందించారు.అనంతరం స్వామి, అమ్మవారిని టిటిడి ఛైర్మన్ శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందించారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







