సైబర్ ఫ్రాడ్స్ అలెర్ట్.. ఒరిజినల్ బ్రాండెడ్ సైట్ల లాగే ఫేక్ సైట్లు..!!
- June 30, 2025
కువైట్: పేరుమోసిన కంపెనీలను అనుకరిస్తూ నకిలీ ఆన్లైన్ పేజీల ద్వారా నివాసితులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసం పెరుగుతున్నట్లు సైబర్సెక్యూరిటీ కమిటీ అధిపతి మొహమ్మద్ అల్-రషీది హెచ్చరించారు. "ఈ హ్యాకర్లు కాలానుగుణంగా, ప్రసిద్ధ కంపెనీల పేరుతో నకిలీ ప్రమోషన్లు, డిస్కౌంట్లను అందించే మోసపూరిత సోషల్ మీడియా పేజీలను సృష్టించడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు." అని అల్-రషీది తెలిపారు.
అధికారిక అప్లికేషన్లు , ధృవీకరించబడిన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. "మీరు అధికారిక ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవడం అత్యవసరం. ఎందుకంటే అవి అనుకరించడం కష్టం. వాటిపై ఆధారపడటం వల్ల సైబర్ స్కామ్లకు గురయ్యే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి." అని పేర్కొన్నారు.
"బాధితులను ఆకర్షించిన తర్వాత, వారు తరచుగా చెల్లింపులు చేయమని, కార్డు వివరాలను నమోదు చేయమని అడుగుతారు. అప్పుడే దొంగతనం జరుగుతుంది." అని ఆయన అన్నారు. URL సురక్షితమైనదా లేదా హానికరమైనదా అని నిర్ణయించడంలో సహాయపడే ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా అనుమానాస్పద లింక్లను ధృవీకరించుకోవాలని కూడా ఆయన వసూచించారు.
ఇటీవల ఫేస్బుక్, యూట్యూబ్ లలో బ్రౌజ్ చేస్తున్న సమయంలో ప్రమోషనల్ ఆఫర్ ల ఫ్రాడ్ పెరిగిందన్నారు. అది నిజమైనదని నమ్మి, ప్రకటనపై క్లిక్ చేస్తే అది వేరే ఫేక్ సైట్ కు నావిగేట్ అవుతుందన్నారు. తన బ్యాంక్ వివరాలను నమోదు చేసి, SMS ద్వారా అందుకున్న వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని నమోదు ద్వారా ఆర్డర్ ఇవ్వగానే, మోసాలకు తెరతీస్తారని హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి, ముందు జాగ్రత్త చర్యగా ఖాతాను వెంటనే సస్పెండ్ చేయించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ ఆఫర్ల ప్రామాణికతను ధృవీకరించుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారని గుర్తుచేశారు. ముఖ్యంగా సున్నితమైన సమాచారాన్ని ఆన్ లైన్ లో పంచుకోవద్దని, గుర్తు తెలియని ప్లాట్ఫారమ్ల ద్వారా చెల్లింపులను చేయవద్దని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







