తాటి చెట్టుని బస్సు డీ కొట్టడంతో 12 మంది కార్మికులకు గాయాలు

- July 14, 2016 , by Maagulf
తాటి చెట్టుని బస్సు  డీ కొట్టడంతో 12 మంది  కార్మికులకు గాయాలు

రాస్ అల్ ఖైమాహ్ :తాటి చెట్టుని బస్సు మలుపు తిరుగుతూ  డీ కొట్టింది. బుధవారం ఉదయం 12 మంది ఆసియా దేశాలకు చెందిన కార్మికులకు  ఘటనలో  ఒక మోస్తరు,తీవ్రమైన గాయాలపాలయ్యారని  రాస్ అల్ ఖైమాహ్ పోలీసులు చెప్పారు.

ట్రాఫిక్, పెట్రోల్ శాఖ డైరెక్టర్ కల్నల్ ఆలీ సయీద్ అల్ ఆలకిం తెలిపిన వివరాల ప్రకారం గాయపడిన కార్మికుల వయస్సు   30, 44 ఏళ్ల మధ్య వారు గాయపడ్డారు. వీరందరిని మెరుగైన చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.ఉదయం 7.30 సమయంలో  పోలీసు చర్యల నిర్వహణ గదికి ప్రమాదం గూర్చి ఫోన్ రావడంతో అప్రమత్తమై పారామెడిక్స్ విభాగానికి వెంటనే ప్రమాదస్ధలికి పంపారు.

పోలీసుల ప్రారంభ పరిశోధనల ప్రకారం  డ్రైవర్ రహదారిపై సరిగా దృష్టి పెట్టలేదని అందుకే ప్రమాదం జరిగినట్లు  నిరూపితమైంది.   ప్రమాదం నివేదిక తదుపరి అవసరమైన చట్టబద్ధమైన ప్రక్రియలు పూర్తి చేయడానికి  సంబంధిత అధికారులకు వద్దకు బదిలీ చేయబడింది .డ్రైవింగ్ పట్ల జాగ్రత్త వహించి డ్రైవింగ్ పై  ఏకాగ్రత కోల్పోకుండా ఉండాలని అలాగే రహదారి భద్రతా నియమాలు కట్టుబడి ఉండాలని  వాహనదారులకు కల్ అల్ ఆలకిం విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com