తాటి చెట్టుని బస్సు డీ కొట్టడంతో 12 మంది కార్మికులకు గాయాలు
- July 14, 2016
రాస్ అల్ ఖైమాహ్ :తాటి చెట్టుని బస్సు మలుపు తిరుగుతూ డీ కొట్టింది. బుధవారం ఉదయం 12 మంది ఆసియా దేశాలకు చెందిన కార్మికులకు ఈ ఘటనలో ఒక మోస్తరు,తీవ్రమైన గాయాలపాలయ్యారని రాస్ అల్ ఖైమాహ్ పోలీసులు చెప్పారు.
ట్రాఫిక్, పెట్రోల్ శాఖ డైరెక్టర్ కల్నల్ ఆలీ సయీద్ అల్ ఆలకిం తెలిపిన వివరాల ప్రకారం గాయపడిన కార్మికుల వయస్సు 30, 44 ఏళ్ల మధ్య వారు గాయపడ్డారు. వీరందరిని మెరుగైన చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.ఉదయం 7.30 సమయంలో పోలీసు చర్యల నిర్వహణ గదికి ఈ ప్రమాదం గూర్చి ఫోన్ రావడంతో అప్రమత్తమై పారామెడిక్స్ విభాగానికి వెంటనే ప్రమాదస్ధలికి పంపారు.
పోలీసుల ప్రారంభ పరిశోధనల ప్రకారం డ్రైవర్ రహదారిపై సరిగా దృష్టి పెట్టలేదని అందుకే ఈ ప్రమాదం జరిగినట్లు నిరూపితమైంది. ఈ ప్రమాదం నివేదిక తదుపరి అవసరమైన చట్టబద్ధమైన ప్రక్రియలు పూర్తి చేయడానికి సంబంధిత అధికారులకు వద్దకు బదిలీ చేయబడింది .డ్రైవింగ్ పట్ల జాగ్రత్త వహించి డ్రైవింగ్ పై ఏకాగ్రత కోల్పోకుండా ఉండాలని అలాగే రహదారి భద్రతా నియమాలు కట్టుబడి ఉండాలని వాహనదారులకు కల్ అల్ ఆలకిం విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







