కొత్త స్పోర్ట్స్ పాలసీకి కేంద్ర కేబినేట్ ఆమోదం
- July 01, 2025
న్యూ ఢిల్లీ: దేశంలోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. అటు రీసెర్చ్ డెవలప్మెంట్ & ఇన్నోవేషన్ స్కీమ్కు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ. 1 లక్ష కోట్లతో కార్పస్ ఫండ్తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రీసెర్చ్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించడమే ప్రధాన ఉద్దేశం. అలాగే దీర్ఘకాలిక తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలు అందించనుంది కేంద్రం.
అలాగే తమిళనాడులో పరమాకుడి-రామనాథపురం మధ్య 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. రూ.1,853 కోట్లతో 46.7 కిమీ మేర 4 వరుసలుగా రహదారి నిర్మించనుంది. అటు రామేశ్వరం కనెక్టివిటీని కూడా ఈ రహదారి మరింత పెంచనుంది.
రీసెర్చ్, ఇన్నోవేషన్కు భారీ కార్పస్ ఫండ్తో స్కీమ్
రూ.1 లక్ష కోట్ల కార్పస్ ఫండ్తో రీసెర్చ్ డెవలప్మెంట్ & ఇన్నోవేషన్ స్కీమ్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడానికి వేదికగా నిలుస్తుంది. దీర్ఘకాలిక తక్కువ వడ్డీ రుణాలు లేదా వడ్డీ లేని రుణాలు అందించనుంది.
టెక్నాలజీ, స్టార్టప్, హై-ఎండ్ పరిశోధనలకు ఇది పెద్ద మద్దతుగా మారనుంది. పరమాకుడి – రామనాథపురం మధ్య 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మొత్తం రూ.1,853 కోట్లు వ్యయంతో 46.7 కిలోమీటర్ల రహదారి నిర్మించనున్నారు.
రామేశ్వరం కనెక్టివిటీ మెరుగుపడడంతో పాటు అభివృద్ధికి దోహదం చేస్తుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







