తెలంగాణ: ఇక పై బస్టాండ్లలో కూడా ఫ్రీ వైఫై
- July 02, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తన సేవల స్థాయిని మరింతగా అభివృద్ధి చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి దూసుకెళ్తోంది. ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడం, బస్సుల్లో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారడం, బస్టాండ్లలో వేచి ఉండే సమయాన్ని ఉపయోగకరంగా మార్చడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని, ఆర్టీసీ తాజాగా వైఫై సదుపాయం అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.ఇప్పటికే ఒక ప్రైవేట్ ఇంటర్నెట్ సంస్థతో చర్చలు జరిపింది.ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్టీసీ అధికారులు ఈ ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్తో సంతృప్తి చెందిన మంత్రి పొన్నం, వైఫై సౌకర్యం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది
దీంతో ఆర్టీసీ యాజమాన్యం తమ ఈ వినూత్న ప్రణాళికను వేగవంతం చేయడానికి చర్యలను ముమ్మరం చేసింది.మొదటి దశలో అన్ని రకాల బస్సులు, బస్ స్టేషన్లలో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ముందుగా ఎంపిక చేసిన సినిమాలు, పాటలను చూడగలుగుతారు. తదుపరి దశలో సాధారణ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా అందించే యోచన ఉంది. అయితే ఈ సినిమాలు, పాటలను వీక్షించే సమయంలో మధ్య మధ్యలో ప్రకటనలు వస్తాయి.ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా సంస్థకు భారీ ఆదాయం సమకూరనుందని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది.ఈ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం ఇంటర్నెట్ సంస్థకు, ఆర్టీసీ యాజమాన్యానికి చెరి సగం చొప్పున లభిస్తుంది.
ప్రజా రవాణా వ్యవస్థ వైపు ఆకర్షించడం
దీనివల్ల ఆర్టీసీ ప్రయాణికులకు వినోదాన్ని పంచుతూనే, సంస్థకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతుంది. ప్రయాణికులు నిరీక్షణ సమయాన్ని లేదా ప్రయాణ కాలాన్ని ఆనందంగా గడపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా ఎక్కువ మంది ప్రజలను ప్రజా రవాణా వ్యవస్థ వైపు ఆకర్షించడం, తద్వారా సంస్థ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయడం టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ప్రయాణికులు తమ బస్సును కోసం వేచివుంటూ కూడా ఇంటర్నెట్ ద్వారా తమ పనులను నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు తమ డేటా ఖర్చు లేకుండా వర్క్ చేయగలుగుతారు. అలాగే టూరిస్టులకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!