జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
- July 03, 2025
న్యూ ఢిల్లీ: దేశం మొత్తం వేచి చూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ తేదీలకు ఆమోదం తెలపగా, ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో వెల్లడించారు.
సమావేశాల పొడిగింపు
ఈ సమావేశాలు మొత్తం 26 రోజులు జరగనున్నాయి.అయితే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆగస్టు 13, 14 తేదీల్లో సభలు ఉండవు. ముందుగా ఈ సమావేశాలు ఆగస్టు 12తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మరో వారం రోజుల పాటు పొడిగించారు. ప్రభుత్వం ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. అందులో అణుశక్తి రంగంలో ప్రైవేటు సెక్టర్ ప్రవేశాన్ని అనుమతించే చట్టాలు ఉన్నాయి. సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, అటామిక్ ఎనర్జీ చట్టంలో సవరణలు చేయాలని అనుకుంటోంది.కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రకటనను అమలు చేయడానికే ఈ వారం రోజుల వ్యవధిని పొడిగించినట్లు తెలుస్తోంది.
విపక్షాల డిమాండ్లు–భద్రతా, రాష్ట్రీయ అంశాలపై కేంద్రంపై ఒత్తిడి
ఈ వర్షాకాల సమావేశాల్లో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యపై స్పష్టత ఇవ్వాలని కోరాయి. ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను కూడా తెలపాలని పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలోనే వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉంది.
గత సమావేశాల గుర్తు–వక్ఫ్ బిల్లు, విశ్వవిద్యాలయ చట్టం
ఇక గత బడ్జెట్ అయితే 2025లో జనవరి 31వ తేదీ- ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అప్పుడే ఉభయసభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమెదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో బిల్లుగా మారింది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమావేశాల్లో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు 2025 కూడా ఆమెదం పొందింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!