'యోగి ఆదిత్య నాథ్ ‘బయోపిక్’ టీజర్ చూసారా!
- July 03, 2025
ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బయోపిక్ ‘అజయ్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి’ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా టీజర్ను తాజాగా విడుదల చేయగా, దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా ‘కాదేదీ కవితకనర్హం’ అన్నట్టుగానే, ‘కాదేదీ బయోపిక్కు అనర్హం’ అన్న రీతిలో ఇప్పుడు వివిధ రంగాల ప్రముఖుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. సమాజంలో మంచిగానో, చెడుగానో ఏదో రకంగా ప్రాచుర్యం పొందిన వ్యక్తుల జీవిత కథలు సినిమాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో దేశ నాయకులైన మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ వంటి వారిపై బయోపిక్లు తెరకెక్కాయి. ఆ తర్వాత క్రీడా ప్రముఖుల జీవితాలను కూడా సినీ జనాలకు పరిచయం చేశారు. విస్మయకరమైన విషయం ఏమంటే, స్మగ్లర్ వీరప్పన్ లాంటి వివాదాస్పద వ్యక్తుల బయోపిక్లు సైతం రూపొందాయి. ఈ జాబితాలో తాజాగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవిత కథ కూడా చేరింది. హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అజయ్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో యోగి ఆదిత్యనాథ్ పాత్రను బాలీవుడ్ నటుడు అనంత్ జోషి పోషించడం విశేషం.
నటీనటులు మరియు విడుదల వివరాలు
రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్లో ప్రముఖ నటులు పరేష్ రావల్, పవన్ మల్హోత్రా, గరిమా విక్రాంత్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యోగి ఆదిత్యనాథ్ జీవితంలోని ఆసక్తికరమైన ఘట్టాలను, ఆయన ప్రస్థానాన్ని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారని మేకర్స్ చెబుతున్నారు. ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ముఖ్యమంత్రిగా ఆయన సాధించిన విజయాలు, రాజకీయ ప్రస్థానం, అలాగే వ్యక్తిగత జీవితంలోని అరుదైన విషయాలను ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా రాజకీయ నాయకుల బయోపిక్లు తరచుగా వివాదాలకు దారి తీస్తుంటాయి, అయితే ఈ సినిమా ఎలాంటి చర్చలకు దారితీస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్లో ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!