ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఒమన్, బల్గేరియా చర్చలు..!!
- July 04, 2025
సోఫియా: ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ఒమన్, బల్గేరియా సోఫియా నగరంలో అధికారిక చర్చలు జరిపారు. ఒమన్ నుండి విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైది నాయకత్వం వహించగా, బల్గేరియన్ నుండి బల్గేరియా రిపబ్లిక్ ప్రధాన మంత్రి రోసెన్ డిమిట్రోవ్ జెలియాజ్కోవ్ పాల్గొన్నారు.
ఈ సెషన్ లో రెండు దేశాల మధ్య స్నేహం, సహకారం సహా వివిధ అంశాలను చర్చించారు. ఆర్థిక, సాంస్కృతిక, శాస్త్రీయ రంగాలలో భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.
ఈ సెషన్లో బల్గేరియాకు ఒమన్ సుల్తానేట్ నాన్-రెసిడెంట్ రాయబారి యూసఫ్ అహ్మద్ అల్ జాబ్రీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలో యూరప్ విభాగం అధిపతి ముంతిర్ మహఫౌద్ అల్ మంధేరిలతోపాటు రెండు దేశాల నుండి ముఖ్యమైన అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







