రాజు చార్లెస్ III ను కలిసిన సుల్తాన్ హైతం బిన్ తారిక్..!!
- July 05, 2025
లండన్: ఒమన్ కింగ్ సుల్తాన్ హైతం బిన్ తారిక్.. ఇంగ్లాండ్లోని బెర్క్షైర్లోని విండ్సర్ కోటలో గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్కు చెందిన యునైటెడ్ కింగ్డమ్ (UK) రాజు, కామన్వెల్త్ అధిపతి చార్లెస్ III తో సమావేశమయ్యారు. కింగ్ సుల్తాన్ ప్రస్తుతం UKలో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు.
ఈ సందర్భంగా రాజు సుల్తాన్ - రాజు చార్లెస్ III రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలు, మెరుగైన భవిష్యత్ కోసం, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు.
అలాగే, ఇటీవలి ప్రపంచ పరిణామాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ ఉద్రిక్తతలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉమ్మడి ఆందోళన కలిగించే అనేక అంశాలపై ఇరు పక్షాలు అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









