రాజు చార్లెస్ III ను కలిసిన సుల్తాన్ హైతం బిన్ తారిక్..!!
- July 05, 2025
లండన్: ఒమన్ కింగ్ సుల్తాన్ హైతం బిన్ తారిక్.. ఇంగ్లాండ్లోని బెర్క్షైర్లోని విండ్సర్ కోటలో గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్కు చెందిన యునైటెడ్ కింగ్డమ్ (UK) రాజు, కామన్వెల్త్ అధిపతి చార్లెస్ III తో సమావేశమయ్యారు. కింగ్ సుల్తాన్ ప్రస్తుతం UKలో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు.
ఈ సందర్భంగా రాజు సుల్తాన్ - రాజు చార్లెస్ III రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలు, మెరుగైన భవిష్యత్ కోసం, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు.
అలాగే, ఇటీవలి ప్రపంచ పరిణామాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ ఉద్రిక్తతలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉమ్మడి ఆందోళన కలిగించే అనేక అంశాలపై ఇరు పక్షాలు అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







